సినిమాల్లో కొంతమంది నటీనటులు లక్కీ చార్మ్ గా మారతారు. వాళ్ళు కమెడియన్స్ కావచ్చు, కేరెక్టర్ ఆర్టిస్టులు కావొచ్చు, విలన్లు కావొచ్చు, టెక్నీషియన్లు కావచ్చు. చేసేది చిన్న పాత్రా.. పెద్ద పాత్రా.. అతిధి పాత్రా అనేది కాకుండా వారు లక్కీ హ్యాండ్ గా మారతారు. వారి కేరెక్టర్ సినిమాని నిలబెట్టకపోయినా వారి ప్రెస్సెన్స్ అలా అనిపిస్తుంది. ఇటీవల అలా లక్కీ ప్రెస్సెన్స్ నటిగా మారిన నటి రోహిణి అనే చెప్పాలి. ఈమె నటించిన మూడు సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించాయి. ఈ మూడు సినిమాలు కూడా మెగా హీరోలవే కావడం యాదృచ్చికం.

 

 

2018లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో చరణ్ కు తల్లిగా నటించింది. ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి నాన్ బాహుబలి రికార్డులు సృష్టించింది. 2019లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సైరా మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా టాలీవుడ్ లో తెలుగు వెర్షన్ లో రంగస్థలం రికార్డులను బద్దలు కొట్టింది. 2020 సంక్రాంతికి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ అల.. వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి తల్లిగా నటించింది. ఈ సినిమా రంగస్థలం, సైరా రికార్డులను బద్దలుకొట్టి సరికొత్త నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాల్లోని రోహిణి పాత్రలు కథను మలుపు తిప్పే పాత్రలు కాకపోయినా కీలకమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేసింది. దీంతో మెగా హీరోలకు ఆమె లక్కీ చార్మ్ గా మరిందనే చెప్పాలి.

 

 

ఎనభై దశకంలో నటిగా రోహిణికి మంచి పేరు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో అనేక పాత్రలు పోషించింది. ఎంతోమంది హీరోయిన్లకు ఆమె తన గాత్రంతో డబ్బింగ్ చెప్పి మెప్పించింది. విలక్షణ నటుడు, ప్రముఖ విలన్.. రఘువరన్, రోహిణి భార్యా భర్తలు. పెళ్ళైన కొన్నాళ్ళకు వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొన్నేళ్ల క్రితం రఘువరన్ మృతి చెందగా.. రోహిణి అనేక తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: