టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సి వస్తే ఆయన సినిమా కలెక్షన్లు, ఓపెనింగ్స్ చూస్తే తెలిసిపోతుంది. పదేళ్లపాటు ఫ్లాప్స్ ఉన్నా బిజినెస్ తగ్గలేదు. పైగా.. క్రేజ్ అంతకంతకూ పెరిగిందే తప్ప తగ్గలేదు. అలాంటి పవన్ కల్యాణ్ కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉండి ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వస్తుంటే ఆ క్రేజ్ లెవల్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఆయన పింక్ రీమేక్ షూటింగ్ లో ఇప్పటికే పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇదే వరుసలో క్రిష్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

 

 

ఈ సినిమాల లిస్టులో పవన్ అభిమానులు ఖచ్చితంగా ఎదురుచూసేది మాత్రం హరీశ్ శంకర్ తో పవన్ సినిమా గురించే. ఇప్పటి నుంచే హరీశ్ కు పవన్ ఫ్యాన్స్ నుంచి రిక్వెస్టులు కూడా వెళ్లిపోతున్నాయి. సినిమా మాసివ్ గా ఉండాలని.. పవర్ స్టార్ రేంజ్ లో ఉండాలని. అయితే.. ఇదే లైన్లో ఈ సినిమాలో హీరోయిన్ పై కూడా ఫిలింనగర్లో ఆసక్తికరమైన గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ పూజా హేగ్డేను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నారని అంటున్నారు. శృతిహాసన్ పేరు కూడా వినబడుతున్నప్పటికీ హరీశ్ మాత్రం పూజా వైపై మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేశ్ సినిమాలతో తన సినిమాలకు లక్కీచార్మ్ గా మారడంతో ఆమె వైపే ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు చూస్తున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ను ఎంతమంది దర్శకులు డైరక్ట్ చేసినా హరీశ్ శంకర్ మాత్రమే అభిమానులకు కిక్కిచ్చే చాయిస్ అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: