నాగశౌర్య, మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. తాజాగా ఈ చిత్రం విడుదలై అన్నివర్గాల ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. దాంతో చిత్రబృందం సక్సెస్ టూర్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో శాంతి థియేటర్ లోని ఫస్ట్ షోకు, అలాగే ఏసియన్ లక్ష్మీకళ థియేటర్ లోని సెకెండ్ షోకు `అశ్వ‌థ్థామ‌`టీమ్ బ్లాక్ బస్టర్ టూర్ అంటూ వేళ్ళబోతుంది.  రియల్ స్టోరి నేపథ్యంలో తాను రాసుకున్న కథతో ముందుకొచ్చిన నాగశౌర్య టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. 'అశ్వథ్థామ' సినిమాకు తొలిరోజే 5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాల అంచనా.

 

ఇక ఈ మూవీకి హిట్ టాక్‌ వచ్చిందని చిత్రబృందం సంతోషంగా ఉంది.  నాగశౌర్య కెరీర్‌లోనే హయస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి మూడు, నాలుగు వారాలు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. యూత్, కాలేజీ స్టూడెంట్స్ నుండి మంచి స్పందన వస్తోంది. ఇక ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో మొత్తం రూ .7.05 కోట్లు వసూలు చేసింది. పైగా తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ వస్తుండటంతో థియేటర్స్ ను పెంచారు.

 

నాగ శౌర్య తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను నూతన దర్శకుడు రమణ తేజ ఆసక్తికరమైన సస్పెన్స్ తో ఆకట్టుకొనేలా తెరకెక్కించారు. ఈ మూవీ రిలీజ్ సమయానికి గత నెల మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీస్ హిట్ టాక్ రావడం.. కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతూ ఉన్నాయి. ఈ నేపత్యంలో నెల రోజుల వరకు ఈ ప్రభావం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాగ శౌర్య నటించిన మూవీ వాస్తవానికి మిశ్రమ స్పందన వచ్చినా.. కొన్ని చోట్ల కలెక్షన్లు బాగానే రాబడుతుంది. శని, ఆదివారాలు కూడా కలిసి వచ్చాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: