మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా టాలీవుడ్ కి హీరోగా అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ మెల్లగా తన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ ని పెంచుకుంటూ ముందుకు సాగారు. ఇక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుండు మొన్నటి అజ్ఞాతవాసి వరకు పవన్ నటించిన సినిమాల్లో హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే ఇటీవల తన జనసేపార్టీ తరపున రాజకీయాల్లో ఎంతో బిజీ అయిన పవన్, ఎట్టకేలకు తనపై విమర్శలు వచ్చినా సరే వాటిని లెక్కచేయకుండా ఫ్యాన్స్ కోసం చివరకు మళ్ళి సినిమాల్లోకి పునః ప్రవేశించారు. 

 

ఇక ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ లో నటిస్తున్న పవన్, దాని అనంతరం మరొక రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి సినిమా కాగా, మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా. ఇక క్రిష్ సినిమాకు ఇటీవల అధికారిక పూజ కార్యక్రమాలు జరిగాయి. కాగా ఆ సినిమా నేటి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. పవన్ కళ్యాణ్ ఒక దొంగగా నటిస్తున్న ఆ సినిమాని మంచి పీరియాడికల్ డ్రామాగా తీయనున్నారు దర్శకుడు క్రిష్. 

 

ఇక ఆపై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయనున్న సినిమా మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప్రారంభం అయ్యే ఆ సినిమాని, వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పింక్ రీమేక్ మాత్రం రాబోయే మే లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కోర్ట్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు ఆయనకు ఎంత మేర విజయాలు అందిస్తాయో చూడాలి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: