రాజకీయాలను, సినిమాలను బ్యాలన్స్ చేసుకుంటూ ప్రయాణించాలని పవన్ కల్యాణ్ తీసుకున్న డెసిషన్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. వెనువెంటనే మూడు ప్రాజెక్టులకు పవన్ ఓకే చెప్పడం వారికి చెప్పలేని ఆనందాన్నిస్తోంది. ఇప్పటికే స్టార్ట్ అయిన హిందీ మూవీ పింక్ రీమేక్ బిజినెస్ కానీ, సినిమా షూటింగ్ స్టిల్స్ కానీ అంచనాలు పెంచేస్తున్నాయి. పవన్ ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అనుకుంటున్న ఫ్యాన్స్ కు ఓ లేటెస్ట్ న్యూస్ అందినట్టే తెలుస్తోంది.

 

 

ఈ సినిమాను వచ్చే వేసవికాలంలో మే 15న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడని సమచారం. ఇటివల ఆయన ఈదిశగా ఆలోచన చేస్తున్నాడని ఫిలిం నగర్లో టాక్ వినపడుతోంది. అందుకు సిద్దంగా ఉన్నట్టు దిల్ రాజు మీడియాలో చెప్పాడని కూడా అంటున్నారు. వచ్చే ఉగాదికి ఈ సినిమా ఫస్ట్ స్టిల్ ను, టైటిల్ ను అనౌన్స్ చేయాలని టీమ్ భావిస్తోందట. నిజంగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను ఇది ఖుషీ చేసే వార్తే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం పవన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఉదయం హైదరాబాద్ లో షూటింగ్.. సాయంత్రం విజయవాడలో పాలిటిక్స్ అంటూ ఇప్పటికే పవన్ కష్టపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

 

 

పవన్ కు వేసవి కాలం బాగానే కలిసొచ్చింది. ఆయన సినిమా కెరీర్ లో వేసవిలో విడుదలైన సినిమాల్లో ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ ఉన్నాయి. హిట్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న పవన్ కు ఈ సీజన్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని దిల్ రాజు భావన. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వేణు శ్రీరామ్ కు ఇప్పటికే పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ వార్తలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: