మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో పదేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. వివివినాయక్ దర్శకత్వంలో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీకి కొణిదెల రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.  ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కానీ ఈ మూవీ అంచనాలు తలకిందులు చేసింది.. భారీ పెట్టుబడి.. నాలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ మూవీ అంచనాలు మాత్రం అందుకోలేకపోయింది. ఇక టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మంచి కథ వినిపించడం.. చిరంజీవి ఒకే చెప్పేయడం.. సెట్స్ పైకి రావడం వెంట వెంటనే జరిగిపోయాయి.

 

కొద్దిరోజుల క్రితం ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఐతే ఈ మూవీ కోసం దాదాపు 20కోట్లకు పైగా ఖర్చుతో ఓ భారీ కాలనీ సెట్ ఏర్పాటు చేశారు.  ఈ సినిమా కోసం హైదరాబాద్ - కోకాపేట్ లో, ఓ దేవాలయంతో కూడిన కాలనీ సెట్ వేశారు. దేవాలయాల మాఫియాకు సంబంధించిన ఈ సినిమాలో మెగస్టార్ ఓ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. ప్రస్తుతం ఈ సెట్ లో హీరో.. తదితరులపై యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. తనపై విరుచుకుపడిన విలన్ గ్యాంగ్ ను చిరంజీవి తనదైన స్టైల్లో రఫ్ ఆడించే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 

ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ సబ్జెక్టు తో ఈ మూవీ తెరకెక్కుతుండగా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.  కాకపోతే ఇప్పటి వరకు చిరు సరసన ఎవరు హీరోయిన్ అన్న విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే చిరు సరసన త్రిష నటిస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి.  కాకపోతే హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన జరగలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: