‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత విజయశాంతి మ్యానియా మళ్ళీ ప్రారంభం అవుతుంది అని ఆమె భావించి ఉండాలి. అయితే ‘సరిలేరు’ మూవీ మహేష్ కు రష్మిక తోపాటు విజయశాంతికి అంతగా కలిసి రాలేదు. దీనితో ఆమె కొద్దిగా షాక్ అయినట్లు ఈ రోజు విజయశాంతి చేసిన ట్విట్ బట్టి అర్ధం అవుతోంది.
‘సరిలేరు నీకెవ్వరు ...ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా నట ప్రస్థానంలో కళ్లుకుల్ ఐరమ్, కిలాడి కృష్ణుడు (1979) నుంచి ...నేటి సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు గౌరవాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం...మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తుందో లేదో నాక్కూడా తెలియదు. ఇప్పటికి ఇక సెలవు. మనసు నిండిన మీ ఆరణకు నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి ఎప్పటికీ నమస్సులు....మీ విజయశాంతి’ అంటూ ఆమె తన ట్విట్ ను ముగించింది.
ఆ ట్విట్ విజయశాంతి నుండి వచ్చిన కొద్ది గంటలలోనే వైరల్ గా మారడమే కాకుండా ‘ఇక సెలవు’ అంటూ విజయశాంతి అంత భావోద్వేగంతో ఎందుకు ట్విట్ చేసింది అంటూ చాలామంది షాక్ అవుతున్నారు. మరి కొందరైతే ప్రస్తుతం ఆ ట్విట్ లో పేర్కొన్న విధంగా విజయశాంతి లేటెస్ట్ గా ఏ ప్రజాపోరాటం చేస్తోంది అంటూ ఆశ్చర్య పోతున్నారు.
వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత విజయశాంతికి కొంతమంది దర్శక నిర్మాతల నుండి ఆఫర్లు వచ్చినా ఆమె చెపుతున్న భారీ పారితోషికానికి ఆ చెపుతున్న కండిషన్స్ కు చాలామంది దర్శకులు బయంతో రివర్స్ గేరులో వేల్లిపోతున్నట్లు టాక్. దీనితో ఆమె అంచనాలు అన్నీ తారుమారు అవ్వడంతో నైరాశ్యం పెరిగిపోయి ఇలాంటి ట్విట్ చేసిందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనితో ఈమె ట్విట్ సమాధానం లేని ప్రశ్నగా మారింది..