తమిళహీరో కార్తి, యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ఖైదీ. గత ఏడాది దీపావళి టైంలో విడుదలైన ఈచిత్రం100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఒక్క తమిళం లోనే కాదు పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి తెలుగులోకూడా ఖైదీ సెన్సేషన్ సృష్టించింది. హీరోయిన్ ,సాంగ్స్ వంటి కమర్షియల్ అంశాలు లేకుండా వచ్చిన ఈచిత్రం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. ఖైదీ చిత్రాన్ని నిర్మించిన డ్రీం వారియర్ పిక్చర్స్ తో కలిసి రిలయన్స్ ఎంటర్ టైమెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఈ రీమేక్ కు నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులను ఇంకా ఫైనల్ చేయలేదు. మరి ఈచిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారో చూడాలి. ఇక ఖైదీ బంపర్ హిట్ కావడంతో ఈచిత్రానికి సీక్వెల్ కూడా రానుందని ఇటీవల
సక్సెస్ మీట్ లో కార్తి వెల్లడించిన విషయం తెలిసిందే. అన్ని కుదిరితే ఈ ఏడాది మే లో
ఖైదీ 2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు వున్నాయి.
ఇక
కార్తి ప్రస్తుతం రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ డైరెక్షన్ లో
సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రంతోపాటు మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్
మూవీ పొన్నియన్ సెల్వన్ లో కూడా
కార్తి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక
ఖైదీ తరువాత
లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం స్టార్
హీరో విజయ్ తో
మాస్టర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో
విజయ్ సేతుపతి,విలన్ పాత్రలో నటిస్తుండగా ఈ
సినిమా పై
తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. ఏప్రిల్ 9న ఈ చిత్రం రెండు భాషల్లో విడుదలకానుంది.