టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకున్న దర్శకుడు క్రిష్ ఆ మద్య నందమూరి బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు మూవీస్ తో దారునమైన దెబ్బతిన్నారు.  అంతకు ముందు బాలయ్యతో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా పవన్ కళ్యాన్ ‘పింక్’ మూవీ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోని కపూర్ కలిసి సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మే 23న విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో పవన్ సరసన నివేతా థామస్, అనన్య కలిసి నటిస్తున్నారు.  ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నటించబోతున్నారట. అటు రాజకీయలతో ఇటు సినిమాలతో బిజీగా ఉండాలని అనుకుంటున్నారు హీరో పవన్ కళ్యాణ్.  


పవన్ కళ్యాణ్ 27 వ సినిమా కూడా మొదలైంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహించారు. క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకేక్కబోతున్న ఈ సినిమా ఫిబ్రవరి 4 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటి నుండి తెలుస్తున్న వివరాల ప్రకారం ఇదొక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రమని, మొగలుల కాలంలో నడిచే కథని తెలుస్తోంది. 


అంతేకాదు ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. ఇదొక తిరుగుబాటుదారుని కథే అయినా ఈ కథకి మూలం కథానాయకుడి ప్రేమకథట. ఆ ప్రేమకథ చుట్టూనే మిగతా కథ అల్లుకుని ఉంటుందట. క్రిష్ గత చిత్రాలు చూసుకుంటే అన్నిటిలోనూ మంచి ప్రేమకథలుంటాయి.  మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అంటున్నారు. ఇందులో పవన్ మార్క్ ఎంటర్టెయిన్మెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ పుష్కలంగా ఉండనున్నాయి అంటున్నారు. మరి ఈ మూవీ పవన్ కి ఎంత సక్సెస్ ఇస్తుందో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: