ఈ మాటలు అంటుంది ఎవరో కాదు.. స్టార్ కమెడియన్ కం హీరో సునీల్.  కామెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సునీల్  ‘అందాలరాముడు’ మూవీతో హీరోగా మారారు.  ఈ మూవీ తర్వాత అదృష్టం కలిసి వచ్చి రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’ మూవీలో నటించాడు.  ఈ మూవీ సునీల్ కి బాగా కలిసి వచ్చింది.  ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు.  దాంతో ఇక లాభం లేదనుకొని మళ్లీ కమెడియన్ గానే స్థిరపడ్డారు.  సినీ పరిశ్రమలో సునీల్ బెస్ట్ ఫ్రెండ్ రూమ్ మెట్ అయిన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీతో కమెడియన్ గా మారారు సునీల్.  ఆ తర్వాత రీసెంట్ గా రవితేజ నటించిన డిస్కోరాజా మూవీలో కామెడీ పండిస్తూనే నెగిటీవ్ రోల్ లో నటించారు.  


అంతే కాదు త్వరలో బాలయ్య నటిస్తున్న ఓ మూవీలో సునీల్ విలన్ గా నటించబోతున్నారని టాక్ కూడా వినిపించింది. తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్రలైన నటిస్తానని అంటున్నారు సునీల్. అయితే సినీ నటుడు సునీల్ అనారోగ్య కారణాలతో హైదరాబాదు గబ్బిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆయన సాధారణ ఫ్లూ జ్వరంతో బాధ పడినట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సునీల్ సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన తెలిపారు.  


అసలే సోషల్ మీడియా ఇక పుకార్లు ఏ రేంజ్ లో వెళ్లాయంటే.. సునీల్ ఇక ఉంటాడా.. పోతారా అన్న లెవెల్లో న్యూస్ వ్యాపించింది.  దాంతో బాబో నేను బాగానే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు సునీల్.  తాజాగా మరోసారి స్పందించారు  సునీల్.   తాను క్షేమంగానే ఉన్నానని సునీల్ తెలిపారు. తన ఆరోగ్యంపై కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్టు తనకు తెలిసిందని... ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని, తాను షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చానని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా ఈ పుకార్లకు తెర పడుతుందేమో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: