భారతదేశ అద్భుత చిత్రకారుడు రాజా రవివర్మ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అతని చిత్రాలు చీర కట్టిన ఆడవారి అందాలను చాలా అద్భుతంగా చూపిస్తాయి. అతను గీసిన చిత్రాలతో స్త్రీలను పోలిస్తే.. ఆ స్త్రీలు కచ్చితంగా చక్కని అందచందాలతో ఉంటారని అర్ధం.



అయితే ప్రస్తుతం సమంత అక్కినేని రాజా రవివర్మ గీసిన ఒక చిత్రాన్ని పోలేలాగా కనిపించి అందరి కళ్ళని తన వైపు తిప్పుకుంటుంది. రాజా రవివర్మ పెయింటింగ్ లో కనిపిస్తున్న ఒక యువతి లాగా కనిపించేందుకు సమంత బంగారపు కలరు చీరను కట్టి ఒక నిమ్మ పండు పట్టుకొని ఫోటోకి ఫోజు ఇచ్చింది. అంటే సేమ్ కాస్ట్యూమ్, సేమ్ జువెలరీ, సేమ్ లైటింగ్ ఇంకా ఇతర వాటిని కూడా రాజా రవివర్మ చిత్రాన్ని పోలేవిధంగా అమర్చారు. తరువాత ఫోటోగ్రాఫర్ వెంకట్ రామ్ సమంత అందాన్ని కెమెరాలో బంధించి... దానికి కాస్త గ్రాఫిక్స్ మెరుగులు దిద్ది రాజా రవివర్మ పెయింటింగ్ ను మైమరపించేలా రూపొందించారు.


అదేవిధంగా కమల్ హాసన్ పెద్ద కూతురు, నటి శృతిహాసన్ కూడా రాజా రవివర్మ గీసిన ఒక బొమ్మ లాగా తయారయ్యి అందరి మనసులను దోచేస్తోంది. ఆమె నీలం కలర్ చీర కట్టి ముత్యాల హారాలను ధరించి అచ్చం రాజా రవివర్మ గీసిన ఒక బొమ్మని అద్భుతంగా ప్రతిబింబించింది. అయితే నామ్ చారిటబుల్ సంస్థ అధినేత నటి సుహాసిని మణిరత్నం ఒక క్యాలెండర్ కోసం సమంత, శృతిహాసన్, రమ్యకృష్ణ తో పాటు మంచు లక్ష్మి ఇంకా తదితర ప్రముఖ నటీమణులతో ఫోటో షూట్ నిర్వహించారు. 12 రాజా రవివర్మ చిత్రాలను ఎంచుకొని వాటిని ప్రతిబింబించేలా 12 మంది నటీమణుల కి ఫోటో ఫోటో ఫోటో షూట్ నిర్వహించి ఫోటోగ్రాఫర్్ వెంకట్ రామ్ సహాయంతో రీక్రియేట్ చేయించారు సుహాసిని.


తన స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు సంబంధించిన యాక్టివిటీస్ చేసే సుహాసినికి రాజా రవి వర్మ పెయింటింగ్స్ అంటే చచ్చేంత ఇష్టం.. అందుకే తమ సంస్థ పేరుతో ఒక క్యాలెండర్ ని, ఇంకా బుక్లెట్ లని రాజా రవివర్మ బొమ్మలను పోలిన రీ క్రియేటెడ్ నటీమణుల చిత్రాలతో విడుదల చేయనున్నారు. ఇవి అమ్ముడుపోయి తరువాత వచ్చిన డబ్బులను మహిళల యాక్టివిటీస్ కోసం ఉపయోగిస్తానని ఆమె చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 12 నటీమణుల రీక్రియేటెడ్ రాజా రవివర్మ చిత్రాలు కన్నులపండుగగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: