నందమూరి నటింహం బాలకృష్ణ.. ఈ మధ్య వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల విడుదలయిన రూలర్ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఇది ఇలా ఉండగా బాలయ్య సినిమాలు హిట్ అవుతున్న సందర్బంగా అయన సినిమాలలో నటించటానికి చాలా మంది కుర్ర హీరోయిన్లు పోటీ పడుతున్నారు. ఈ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించబోతున్నారట. అందు కోసమే ఆయన సర్జరీ చేయించుకున్నారట. గుండుతో కనిపిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ఇద్దరు క్రేజీ కథానాయికలు నటించే అవకాశం వుందని తెలసింది.
తాజాసమాచారం ప్రకారం ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్గా శ్రియ, `సింహా` తరహాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్గా నయనతార నటించరున్నారని తెలిసింది. ముందు ఈ చిత్రంలోని ఓ హీరోయిన్గా కేథరిన్ నటిస్తుందని ప్రచారం జరిగింది. దర్శకుడు బోయపాటి ఆమెని ఫైనల్ కూడా చేశారు.కానీ ఏమైందో కానీ ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. ఇద్దరు హీరోయిన్ల కోసం అన్వేషణ మొదలుపెట్టిన బోయపాటి శ్రీను చివరికి నయనతార, శ్రియలని ఫైనల్ చేసినట్టు తెలిసింది.
నయనతార సింహా, జై సింహా చిత్రాల్లో బాలయ్యతో కలిసి నటించింది. ఇక శ్రియ `చెన్నకేశవరెడ్డి`, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ చిత్రాల్లో నటించింది. ఇది బాలయ్యతో ఆమెకు నాలుగవ సినిమా కావడం విశేషం.. ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కానుంది .. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చిత్ర బృందం తో పాటుగా అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజులో హిట్ అవుతుందో చూడాలి.