టాలీవుడ్ లోకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘ఫిదా’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది సాయి పల్లవి.  వాస్తవానికి సాయిపల్లవి ది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం.. కానీ ఈ అమ్మడు మాలీవుడ్ లో ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా పరిచయం కావడంతో అందరూ మాలీవుడ్ హీరోయిన్ అనుకుంటున్నారు. వాస్తవానికి ఈటీవీలో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో జార్జియా లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.  సాయి పల్లవి నాట్యం చూసిన ఓ దర్శకుడు ధూం ధాం అనే తమిళ సినిమాలో కథానాయిక కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు.

 

 

తర్వాత మీరా జాస్మిన్ క్లాస్ మేట్ గా కస్తూరి మాన్ అనే మరో సినిమా లో నటించింది.  ఫిదా మూవీతో అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది  ఈ మూవీలో సాయి పల్లవి డైలాగ్స్... భానుమతి హైబ్రీడ్ పిల్లా.. అంటూ అల్లరిగా కనిపిస్తుంది. ఈ మూవీ హిట్ తర్వాత నాని హీరోగా నటించిన ‘ఎంసీఏ’(మిడిల్ క్లాస్ అబ్బాయి) మూవీలో నటించింది. కాకపోతే ఈ మూవీ మిశ్రమ స్పందన రావడంతో సాయి పల్లవికి పెద్దగా పేరు రాలేదు.  సాయి పల్లవికి తెలుుగు తో పాటు తమిళనాట కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇతర భాషల్లో నటించిన సినిమాలను కూడా ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఆమె చైతూ జోడీగా 'లవ్ స్టోరీ' .. రానా సరసన 'విరాటపర్వం' చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే వున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తర్వాత మరోసారి నేచురల్ స్టార్ నాని సరసన నటించబోతున్నట్లు సమాచారం నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆయన సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.  విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: