ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా చాలామందిని శాసించగల సత్త నిర్మాత దిల్ రాజు. ఆయన అనుకుంటే ఎంత పెద్ద సినిమా అయిన పట్టాలెక్కిస్తారు. ఏ హీరో డేట్స్ అయిన అంది పుచ్చుకుంటాడు. మొదటి సినిమా నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకు వరుసగా సినిమా నిర్మిస్తున్న ఏకైక అగ్ర నిర్మాత దిల్ రాజు అని చెప్పక తపదు. సురేష్ బాబు, అల్లు అరవవింద్, అక్కినేని నాగార్జున లాంటి పెద్ద నిర్మాతలు పెద్ద ప్రొడక్షన్ హౌజ్ ఉన్నవాళ్ళు కూడా ఇంత స్పీడ్ గా సినిమాలు నిర్మించలేకపోతున్నారు. అసలు ఒక్క నిర్మాత బాధ్యతనే మోయాలంటే ఇప్పుడు తల ప్రాణం తోక కొస్తుంది. అలాంటిది రాజు గారు మాత్రం హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా చిన్న, మీడియం, భారీ బడ్జెట్ సినిమాలని నిర్మిస్తూ డిస్ట్రిబ్యూటర్ గాను సక్సస్ లను అందుకుంటున్నాడు. 

 

ఇక రాజు గారు ఎప్పటి నుంచో కంటున్న కల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని. ఆ కల నెరవేర్చుకునే పనిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు రాజకీయాలంటు సినిమాలకి దూరంగా ఉన్నాడు. అయితే అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం తో అందరూ షాకయ్యారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారని తెలుసు కాని ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇస్తారనుకోలేదు. అయితే ఆయన రీ ఎంట్రీ వెనక కూడా కొన్ని బలమైన కారణాలున్నాయని వాటిలో ముఖ్యంగా పార్టీని నడపడానికి ముందుగానే దిల్ రాజు, ఏ.ఎ.రత్నం, మైత్రీ మూవీస్, సిరాత ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి భారీ నిర్మాణ సంస్థల నుంచి కొంత అడ్వాన్స్ తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ కారణం తోనే నిర్మాతలకి ఇచ్చిన మాట తోటే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేయాలని డిసైడయ్యారు. 

 

అందుకే ముందుగా దిల్ రాజు, ఏ.ఎం.రత్నం సినిమాలు స్టార్ట్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ సమర్పణలో బాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా కోసం దిల్ రాజు పవన్ కళ్యాణ్ టైం షెడ్యూల్ దృష్ఠ్యా ఫ్లైట్ ఏర్పాటు చేశారని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఉదయం షూటింగ్ మధ్యాహ్నం తర్వాత రాజకీయాలు చూసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబట్టి. 

 

అయితే ఈ విషయంలోనే దిల్ రాజు ని ఇప్పుడు అందరు కామెంట్ చేస్తూ క్వశన్ చేస్తున్నారు. అసలే గత కొద్ది కాలంగా దిల్ రాజు చిన్నన్ హీరోలని చిన్న సినిమాలని పట్టించుకోవడం లేదని. అందుకు ఈ మధ్య దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన సినిమాలు ఉదాహరణలు గా ఉన్నాయి. ఇక తాజా చిత్రం జాను విషయంలో కూడా దిల్ రాజు పట్టించుకోవడ లేదని టాక్ వినిపిస్తోంది. కంప్లీట్ ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ సినిమీదే పెట్టి ఆయన కి అవసరమైనట్టుగా ఫ్లైట్ కూడా అరేంజ్ చేసిన దిల్ రాజు సమంత శర్వానంద్ ల జాను సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతున్నా కూడా అసలు పట్టించుకోవడం లేదని ఆయనకైతే ఫ్లైటిచ్చారు ..కనీసం వీళ్ళకి ప్లేట్ మీల్స్ అన్న పెట్టరా అంటూ దిల్ రాజు మీద కామెంట్స్స్ చేస్తున్నారట. ఆలోచిస్తే నిజమే కదా ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: