రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్న చిరంజీవి ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తూ అవసరం అనుకున్నప్పుడు సలహాలు ఇస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో చిరంజీవి లేటెస్ట్ గా 100 కోట్ల భారీ మొత్తంతో ఒక మహల్ ను తలపించే విధంగా నిర్మించుకున్న తన కొత్త ఇంటికి అనేకమంది అతిధులను వరసపెట్టి పిలవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ముంబాయి కి చెందిన ప్రముఖ ఆర్కటిక్ డిజైన్ చేసిన ఈ ఇంటిలో కళ్ళు చెదిరిపోయే విధంగా ఇంటీరియర్ ఉండటమే కాకుండా ఆ ఇంటిలోని ఫర్నిచర్ ను అనేక దేశాల నుండి ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఉపాసన ఈ ఇంటిని డిజైన్ చేసింది అని అంటారు. ఇప్పుడు ఈ ఇంటిలోకి చిరంజీవి తన కొడుకు చరణ్ తో కలిసి మారిపోవడంతో చిరంజీవి తనకు సన్నిహితంగా ఉండే అనేకమంది ప్రముఖ వ్యక్తులను తన ఇంటికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు అని తెలుస్తోంది. 

ఈ లిస్టులో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు ఫిలిం సెలెబ్రెటీలు రాజకీయ నాయకులు ఉండటంతో ఇంతమందిని చిరంజీవి తన కొత్త ఇంటిని చూడమని ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి చిరంజీవి త్వరలో విశాఖపట్నంలో ఒక భారీ ఫిలిం స్టూడియోను నిర్మించే ఆలోచనలు చేస్తున్నాడు.

అయితే ఈ విషయంలో చిరంజీవిని విశాఖపట్నంలో ఫిలిం స్టూడియో ఆలోచనను మార్చుకోమని సలహాలు ఇస్తున్నట్లు టాక్. దీనితో మెగా స్టూడియోస్ విషయంలో చిరంజీవి ఆలోచనలలో మార్పులు వచ్చినట్లు టాక్. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ఈ విషయాలను చర్చించడానికి చిరంజీవి తన కొత్త ఇంటికి ఇలా ప్రముఖ వ్యక్తులను అందర్నీ వరసపెట్టి పిలుస్తున్నాడా లేకుంటే దీని వెనుక వేరే ఎత్తుగడలు ఉన్నాయా అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: