‘అల వైకుంఠపురములో’ సక్సస్ తో అల్లు కాంపౌండ్ కు 40 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయాలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ‘అల’ సూపర్ సక్సస్ నితిన్ కు ఊహించని విధంగా కాసులు కురిపించడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో నిర్మాణ సంస్థ హారిక హాసిని కి మంచిపేరు వచ్చింది.

ఇప్పుడు ఇదే సంస్థకు చెందిన మరొక నిర్మాణ సంస్థ చెందిన సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ నుంచి వస్తున్న ‘భీష్మ’ కావడంతో ఆ మూవీకి కూడ ‘అల’ అదృష్టం పడుతుందని బయ్యర్లు భావిస్తున్నారు. దీనితో ఈ మూవీకి ఊహించని స్థాయిలో బిజినెస్ అవుతోంది అని వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి నితిన్ సినిమాలు వరసగా ఫ్లాప్ అవుతున్నా ‘భీష్మ’ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు హిట్ కావడంతో పాటు ఈ మూవీ టీజర్ కు కూడ మంచి స్పందన రావడంతో ఈ మూవీ రైట్స్ కోసం తెలుగు రాష్ట్రాల నుండి బయ్యర్లు క్యూ కడుతున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ మూవీలో రష్మిక వేసిన పద్మాసనం స్టెప్ యూత్ లో వైరల్ కావడంతో ‘భీష్మ’ పై విపరీతమైన క్రేజ్ పెరిగి ఈ మూవీకి భారీ ఆఫరింగ్స్ వస్తున్నాయి.

సాధారణంగా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాల బిజినెస్ చాల డల్ గా ఉంటుంది. పరీక్షల సీజన్ దగ్గర పడుతుంది కాబట్టి స్టూడెంట్స్ పెద్దగా సినిమాలు చూడరు అన్న సాంప్రదాయం ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉంది. అయితే ఈ సెంటిమెంట్ ను కూడ పట్టించుకోకుండా ఇప్పుడు ‘భీష్మ’ కు జరుగుతున్న బిజినెస్ ను చూసి ‘అల’ సక్సస్ తో ఇంకా బన్నీ త్రివిక్రమ్ ల పారితోషికం పెరగకపోయినా అప్పుడే నితిన్ కు కాసుల వర్షం కురిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: