టాలీవుడ్ లో ఆ మద్య వరుసగా హాట్ బ్యూటీలు ఎంట్రీ ఇచ్చారు. రకూల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, రెజీనా, అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ ఇలా చాలా మంది హీరోయిన్లు వరుసగా తెలుగు తెరకు పరిచయం కావడం మంచి విజయాలు అందుకోవడం జరిగింది.  అయితే అను ఇమ్మాన్యుయేల్ కి మాత్రం అస్సులు అదృష్టం కలిసి రాలేదు.  స్టార్ హీరోల సరసన నటించినా ఈ హాట్ బ్యూటీకి మత్తుకళ్ల భామకు అస్సలు కలిసి రాలేదు. అందాన్ని ఆరాధించే కుర్రకారుకి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. నాని 'మజ్ను'తో తెలుగువారికి పరిచయమైన ఈ కేరళకుట్టి... అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. 

 

బన్నీతో నాపేరు సూర్య మూవీలో నటించింది.  త్రివిక్రమ్ - పవన్ కళ్యాన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ మూవీలోనటించింది.  కానీ ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అను ఇమ్మాన్యుయేల్  మళ్లీ ఆలోచనలో పడింది. 'శైలజా రెడ్డి అల్లుడు' తరువాత టాలీవుడ్ నుంచి మరో అవకాశం తలుపు తట్టకపోవడంతో... గత ఏడాదిని ఇక్కడ 'జీరో రిలీజెస్ ఇయర్'గా సరిపెట్టింది అను.  ఈ గ్యాప్ లో తమిళంలో 'నమ్మ వీట్టు పిళ్ళై' సినిమా చేసింది.  కానీ ఈ మూవీ కూడా పెద్దగా పేరు తీసుకు రాలేకపోయింది. మళ్ళీ తెలుగు పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిందీ భామ. 

 

నాని, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో ఆడిపాడే ఛాన్సెస్ దక్కించుకున్న  ఈ కేరళా కుట్టి అందం.. అభినయం అన్నీ ఉన్నా అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇక ఇందులో మెయిన్ లీడ్ గా ఇప్పటికే నభా నటేశ్ కన్ ఫర్మ్ అయింది. మరి... శ్రీనివాస్ అండ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాతోనైనా అను కెరీర్ మేలిమలుపు తిరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: