టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య పట్టిందల్లా బంగారం అవుతుందనే చెప్పాలి.  శ్రీమంతుడు మూవీ నుంచి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు వరుస విజయాలు అందుకుంటున్నారు. అంతే కాదు ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరుతున్నారు.  ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబు సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది.  గత ఏడాది వంశి పైడిపల్లి తో మహర్షి మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు.  రైతు గౌరవం పెంపొందించే విధంగా ఈ మూవీ స్టోరీ కొనసాగింది.  ఈ మూవీలో విద్యార్థి, బిజినెస్ మాన్, రైతు పోరాటం చేసే యువకుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు మహేష్ బాబు. 

 

మూవీ సక్సెస్ ఆనందంలో ఉండగానే సరిలేరు నీకెవ్వరు లాంటి మరో బ్లాక్ బస్టర్ మూవీ తో మంచి జోష్ లో ఉన్నారు మహేష్ బాబు.  సాధారణంగ  ఒక మూవీ తర్వాత తన కుటుంబంతో విదేశాలకు వెళ్లడం  చేస్తుంటారు. అయితే ఈ సారి మాత్రం అమెరికా వెళ్లి అక్కడ తన మోకాలి ఆపరేషన్ చేయించుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.  ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిన మహేశ్ బాబు, మోకాలుకి శస్త్రచికిత్స చేయించుకుంటారనే టాక్ వచ్చింది. 5 నెలల విశ్రాంతి అనంతరమే ఆయన షూటింగులో పాల్గొంటారనే ప్రచారం జరిగింది.  కానీ ఆయన ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

 

మహర్షి తర్వాత వంశి పైడిపల్లి తో మరో మూవీలో నటించబోతున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి మహేశ్ బాబు హైదరాబాద్ వచ్చేశాడు. ఆయన మోకాలు శస్త్ర చికిత్సకి సంబంధించిన ప్లానింగులో మార్పు ఏదైనా జరిగిందా అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. మహేశ్ బాబు హైదరాబాద్ కి వచ్చేయడంతో, రేపో మాపో వంశీ పైడిపల్లి సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని అంటున్నారు. అయితే ఈ మూవీ గురించి అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: