టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ అతిపెద్ద సీజన్. ఈ సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని దాదాపు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ నాలుగింటిలో సరిలేరు నీకెవ్వరు మరియు అలా వైకుంఠపురం లో సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ మొదలైన నాటి నుండి రెండు సినిమాల మధ్య పోటా పోటీ వాతావరణం నువ్వానేనా అన్నట్టుగా ఉంది. రిలీజ్ డేట్ విషయంలో ఇద్దరు సినిమాల హీరోలు మహేష్ మరియు అల్లు అర్జున్ వెనక్కి తగ్గక పోవటంతో సినిమా ఇండస్ట్రీ పెద్దలు చొరవ తీసుకోవడంతో ఒక రోజు గ్యాప్ మధ్య రెండు సినిమాలు విడుదలయ్యాయి. రెండు సినిమాలు అదిరిపోయే కలెక్షన్లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రాబట్టాయి.

 

సంక్రాంతి సీజన్ కి వచ్చిన ఈ రెండు సినిమాలు ఇంకా సినిమా హాల్లో ఉండగానే వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ రెడీ అయినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళితే ‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రపంచ సినిమా రంగంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎస్ ఎస్ రాజమౌళి గురించి మాట్లాడుకునే స్థాయికి రాజమౌళి వెళ్ళిపోయాడు. దీంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న 'RRR' సినిమాని ఈ ఏడాది జూలైలో రిలీజ్ చేయాలని భావించిన విషయం అందరికీ తెలిసినదే.

 

కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ విషయంలో రోజురోజుకి లేట్ అవుతున్న నేపథ్యంలో...మెల్లమెల్లగా రాజమౌళి క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి బాహుబలి తర్వాత వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో విజయం సాధించాలని ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఈ ఏడాది జులై కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని పక్క క్లారిటీతో రాజమౌళి ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. దీంతో మెగా మరియు నందమూరి అభిమానులు ఈ వార్త సోషల్ మీడియాలో విని రాజమౌళి ఊరించి ఊరించి భారీ దెబ్బ వేసాడు పర్లేదు వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే 'RRR' రికార్డుల మోత ఖాయమని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: