టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళి దాదాపుగా రెండేళ్ల గ్యాప్ తరువాత ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ లో నటిస్తున్న పవన్, ఇటీవల అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లో ఫుల్ గా బిజీ అయ్యారు. అయితే మళ్ళి సినిమాల్లోకి రావాలని తన ఫ్యాన్స్ యొక్క అభ్యర్ధన మేరకు ఎట్టకేలకు సినిమాల్లోకి పునఃప్రవేశించిన పవన్, అనంతరం మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టడం జరిగింది. ఇకపోతే పవన్ కు టాలీవుడ్ స్టార్ గా అటు ఫిలిం సెలెబ్రిటీలతో పాటు, 

 

ఇటు జనసేన పార్టీ అధినేతగా కూడా పలువురు రాజకీయ నాయకులతో కూడా మంచి అనుబంధం నెలకొని ఉంది. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్నం ఎంపీగా ఎన్నికైన ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ కొద్దిరోజులుగా ప‌వ‌న్‌తో స్నేహం చేస్తున్న‌ట్టు టాక్‌. కేవలం రాజకీయనాయకుడిగానే కాక బిల్డర్ గా పలు నిర్మాణలు చేపట్టిన అనుభవం ఉన్న సత్యనారాయణ, గ‌తంలో మంచు విష్ణుతో ల‌క్కున్నోడు అనే సినిమా చేశాడు. వాస్తవానికి ఆ సినిమా ఘోరముగా పరాజయం పాలవడంతో ఆపై పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపలేదు. 

 

అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో ఆయన నిర్మాతగా ప‌వ‌న్‌తో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పింక్ రీమేక్ తో పాటు క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ రత్నంల సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారి బ్యానర్ లో కూడా మరొక సినిమా చేయనున్న పవన్, సత్యనారాయణతో రాబోయే రోజుల్లో సినిమా చేస్తారని అంటున్నారు. అయితే దీనిపై ఎక్కడా కూడా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం కారణంగా పవన్ సినిమా చేయడానికి ఒప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: