టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరో గా మంచి స్టార్ ఫెమ్ సంపాదించిన విజయ్ దేవరకొండ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి కాకుండా సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీకి తన మార్కెట్ వ్యాప్తి చేసుకుంటూ తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వం లో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతు పర్వాలేదనిపించింది. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ ఇద్దరు స్టార్ హీరోల సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు ఫిలింనగర్ లో కొత్తగా వార్తలు వినబడుతున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు భారీ స్థాయిలో విడుదల అయ్యాయి. అయితే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో పాటల విషయంలో చాలా కేర్ తీసుకుని రెండు సినిమాల యూనిట్లు అద్భుతంగా సినిమాలపై హైప్పు వచ్చే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పాటల విషయంలో “సరిలేరు నీకెవ్వరు” మరియు “అల వైకుంఠపురములో” చిత్రాల పాటలను ఎలా చూసిన 9 అంకె వచ్చేలా ఒకరు 4 గంటల 5 నిమిషాలకు మరొకరు 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేసేవారు.

 

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” పాటలను కూడా ఈ సినిమా పాటల్లానే విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఇదే విధంగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి సంబంధించి పాటల విషయంలో విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరి సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్లు ఫిలింనగర్లో మరియు సోషల్ మీడియా లో వాటర్ గట్టిగా వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: