విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంక్రాంతి హిట్టుగా నిలిచింది. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటిస్తే, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ నటించింది. అయితే ఈ సినిమా మంచి హిట్టు కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి అందరికి తెలిసినదే. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చక చకా జరుగుతున్నాయి.

 

అప్పట్లో ‘F3’ సినిమాకు వెంకటేశ్, వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పారు. బాలీవుడ్‌లో వచ్చిన ‘గోల్‌మాల్’ సినిమా సిరీస్‌లా వరుసగా తీయాలని ఉంది. త్వరలో మరో సినిమా తీయబోతున్నా. ఈ సినిమాలో కథకే ప్రాధాన్యం ఉంటుంది.. అని అనిల్ రావిపూడి గతంలో చెప్పిన సంగతి అందరికి తెలిసినదే. అయితే ‘F3’ లో వీరితో పాటుగా హీరో రవితేజ ను తీసుకున్నారని, అయితే అయన ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా.. అతనిని తీసుకోవడం లేదని వచ్చిన వార్తల సంగతి కూడా తెలిసినదే.

 

ఆ వరుసలో హీరో సాయి ధర్మ తేజ కూడా వచ్చారు. ఈ మధ్యనే విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమా హిట్ తో మంచి జోష్ లో వున్నాడు సాయి ధర్మ తేజ. సాయి తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని సూపర్ కలెక్షన్స్‌ రాబట్టింది. ఈ సినిమా తాజా కలెక్షన్స్... మార్కెట్ ను చేసిన సదరు నిర్మాత ఇపుడు రవితేజ ప్లేసులో ఇతనిని తీసుకుంటున్నట్లుగా సమాచారం.

 

వరుసగా ప్లాప్స్‌ను ఎదుర్కుంటూ... మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయి తేజ్‌కు ఈ సినిమా తన కెరీర్‌తో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సినిమా అటూ ఓవర్సీస్‌లో కూడా మంచి వసూలును రాబట్టింది. ప్రతిరోజూ పండగే’ ఓవర్సీస్‌లో హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది.  యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ ఇతర ప్రధాన పాత్రల్లో ఆకట్టుకున్నారు. థమన్ సంగీతం కూడా సినిమా విజయానికి దోహదం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: