తమిళ స్టార్ హీరో తల అజిత్ ప్రస్తుతం తన 60వ చిత్రం వలిమై లో  నటిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమా రెండు షెడ్యూల్ లను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 హీరో  కార్తికేయ  విలన్ గా నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈవార్తల గురించి అటు కార్తికేయ గాని  మేకర్స్ గాని ఇంతవరకు స్పందించలేదు కానీ  ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం కార్తికేయసినిమా లో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడట అంతేకాదు  ఫిబ్రవరి  మూడో వారం లో రామోజీఫిలిం సిటీ లో జరుగునున్న కొత్త షెడ్యూల్ లో  కార్తికేయ పాల్గొననున్నాడని  తెలుస్తుంది. కాగా కార్తికేయ విలన్ గా నటించడం ఇది రెండో సారి ఇంతకుముందు ఆయన , నేచురల్ స్టార్  నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.  ఖాకి ఫేమ్ హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న వలిమై లో యామి గౌతమ్ ను  హీరోయిన్ గా నటించనుంది.   ప్రముఖ  నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజిత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా  యువన్  శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇదిలా ఉంటే మరోవైపు  హీరోగా నిలదొక్కుకోవడానికి  కార్తికేయ నానా తంటాలు పడుతున్నాడు. ఆర్ ఎక్స్ 100 తో  సెన్సేషనల్  హిట్ కొట్టి  మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఆ తరువాత  హిప్పీ, 90ఎమ్ఎల్ వంటి  అనవసరమైన సినిమాలు చేసి  డిజాస్టర్లను చవిచూశాడు. అయితే కార్తికేయ చేతిలో ఇప్పుడో మంచి ఆఫర్ వుంది. అదేంటంటే తన తదుపరి చిత్రాన్ని  భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, ప్రతిరోజూ పండగే వంటి  బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించిన  గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో చేయనున్నాడు. నూతన దర్శకుడు కౌశిక్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి  'చావు కబురు చల్లగా' అనే టైటిల్ ను ఖరారు చేశారు.  త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: