సినిమా రంగంలో కొందరి కెరీయర్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. మరికొందరు తమ కెరీయర్లో విజయాలు, అపజయాలు చవిచూస్తూ, అలా వెళ్లుతుంటారు. ఇకపోతే 2007లో దర్శకుడు తేజా తీయబోయే సినిమాకు హీరోయిన్ కావాలి. అప్పుడు నటి కాజల్ తేజ కంట్లో పడగా ఆమెను హీరోయిన్ చేసి నందమూరి కళ్యాణ్ రామ్ ను కధానాయకునిగా లక్ష్మీ కళ్యాణం చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ తర్వాత చేసిన సినిమాలు సరైన గుర్తింపును ఇవ్వలేకపోయాయి..

 

 

కానీ ఒకేఒక్క సినిమా కాజల్ కెరీయర్‌ను ఊహించని మలుపు తిప్పింది. అదే మగధీర.. 2009 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలు కొట్టి కలెక్షన్ల వర్షం కురిపించింది.. టాలీవుడ్‌లో వసూళ్ల పరంగా కొత్త రికార్డ్స్‌ను సృష్టించింది.. యువరాణి మిత్రవిందా దేవిగా అభిమానుల గుండెల్లో సుస్దిరస్దానాన్ని సంపాదించుకుంది కాజల్.. ఇక తాను అవకాశాలపరంగా వెనుదిరిగి చూడవలసిన అవసరం కనిపించలేదు. కానీ ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు లేక కాస్త వెనకబడిన కాజల్ అప్పుడప్పుడు వెండి తెరపై తళుక్కున మెరుస్తూనే ఉంది.. ఇక క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలకు దూరంగా ఉన్న కాజల్ సీత‌ చిత్రంలో  మాత్రం కాస్త నెగిటీవ్ ఛాయ‌లున్న పాత్ర పోషించింది.

 

 

అయితే ఈ చిత్రం అనుకున్నంతగా ముందుకు సాగలేదు. కనీసం యావరేజ్‌గా కూడా మిగలలేదు.. ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దపడిన క్రమంలో  మోస‌గ‌త్తైగా క‌నిపించ‌బోతోంద‌ని తెలుస్తోందని సమాచారం.. ఇకపోతే మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ నాయిక. సునీల్‌ శెట్టి కీలక పాత్రలో. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనే కాజల్ ఈ పాత్ర పోషిస్తుందట.. ఇక యాక్షన్‌  ప్రధానంగా సాగే ఈ చిత్రం, చరిత్రలో అతి పెద్ద ఐటీ కుంభ కోణం వెనకనున్న రహస్యాన్ని ఛేదించే కథతో తెరకెక్కుతోందిని తెలుస్తుంది.. మరి ఈ సినిమాలో కాజల్ చేసే మోస‌గ‌త్తై పాత్ర ఎంతవరకు ప్రేక్షకులకు చేరువవుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: