జూనియ‌ర్ ఎన్టీఆర్ మొద‌టి నుంచి కూడా మాస్ హీరోగా  ప్రేక్ష‌కుల్లో మంచి పేరున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఆర్. ఆర్‌.ఆర్‌. చిత్రంలో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం 2020లో వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే అది జ‌న‌వ‌రి 8 2021న విడుద‌ల కానుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఈ చిత్రం 4వ చిత్ర‌మ‌ని చెప్పాలి. 

 

ఎన్టీఆర్ రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ఏప్రిల్ వ‌ర‌కు పూర్తి చేసుకుని త్రివిక‌ర్ర‌మ్‌తో క‌లిసి ఆయ‌న త‌ర్వాత చిత్రం చేయాల‌ని అనుకుంటున్నారు. అది ఈ సంవ‌త్స‌ర‌మే మొద‌లుపెట్టాల‌నుకుంటున్నారు. గత ఏడాది ‘అసురన్’ చిత్రంతో సూప‌ర్‌డూప‌ర్ హిట్ కొట్టిన డైరెక్ట‌ర్ వెట్రి మార‌న్‌. ఈ చిత్రం తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

 

ఈ ద‌ర్శ‌కుడు ఇటీవ‌లె హైద‌రాబాద్ వ‌చ్చి ఎన్టీఆర్‌ని క‌లిసి స్టోరీ లైన్‌ని చెప్పారు. లైన్ బాగా న‌చ్చ‌డంతో స్టోరీని డెవ‌ల‌ప్ చేయ‌మ‌ని చెప్పారు. పూర్తి క‌థ అవ్వ‌గానే నేరేష‌న్ చేయ‌మ‌న్నార‌ని సమాచారం. ప్రస్తుతం వెట్రి మారన్ త‌మిళ్ హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నాడు. ఓప‌క్క ఈ సినిమా చేస్తూనే మ‌రో ప‌క్క ఎన్‌.టి.ఆర్ సినిమా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు మార‌న్‌. 

 


2020 సెకండాఫ్ లో మళ్ళీ ఎన్.టి.ఆర్ ని కలిసి పూర్తి కథని వినిపిస్తార‌ని స‌మాచారం. ఇక ఈ క‌థ గ‌నుక ఓకే  అయితే ఎన్.టి.ఆర్ – వెట్రి మారన్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా 2021లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వెట్రీ మార‌న్ సినిమాల్లో హీరోయిజానికి పెద్ద పీట వేసే పాత్ర‌లు ఉంటాయి.  వెట్రి మారన్ కి ఎన్.టి.ఆర్ లాంటి మాస్ హీరో దొరికితే  మ‌రి ఏ రేంజ్‌లో చూపిస్తాడో చూడాలి. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కే ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. గ‌తంలో మురుగుదాస్‌, లింగుస్వామి, అట్లీ కూడా ట్రై చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: