కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన మూవీ ‘ప్రేమమ్’ తెలుగు లో కూడా అదే పేరుతో తీశారు. అక్కినేని నాగ చైతన్య నటించిన హిట్ మూవీ ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది బ్యూటి ఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.  అయితే ఈ మూవీలో శృతిహాసన్ నటించినప్పటికీ పేరు మాత్రం అనుపమ పరమేశ్వరన్ కే ఎక్కువ వచ్చింది.  ఆ తర్వాత టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసినప్పటికి స్టార్ హీరోల సరసన మాత్రం ఛాన్స్ దక్కించుకోలేపోయింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందించిన ఒక్క శమానం భవతి లో మంచి పేరు సంపాదించింది. కెరీర్ బిగినింగ్ లో   విజయాలు పలకరించినా, ఆ తరువాత పరాజయాలు క్యూ కట్టాయి. ఫలితంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల 'రాక్షసుడు' వంటి సక్సెస్ ను ఆమె అందుకున్నప్పటికీ అవకాశాలు రాలేదు. 

 

ఈ నేపథ్యంలోనే మరోసారి 'దిల్' రాజు బ్యానర్లో చేసే అదృష్టాన్ని ఆమె దక్కించుకుంది.  'దిల్' రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి తనయుడైన ఆశిష్ ను హీరోగా పరిచయం చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను ఆయన పూర్తి చేశాడు.  త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలతో పాటు..అనుపమ గురించి దిల్ రాజు అధికారికగా వెల్లడించనున్నారని లేటెస్ట్ న్యూస్. గతంలో  దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర బ్యానర్ లో అనుపమ శతమానం భవతి సినిమాలో నటించిజాతీయ అవార్డు ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సెంటిమెంట్ తోనే రాజుగారు ఇప్పుడు అనుపమకి దిల్ రాజు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.

 

 

సినిమా మంచి విజయం అందుకోవడంతో మరోసారి అదే సక్సెస్ కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఈ మాలీవుడ్ బ్యూటీని తీసుకున్నారా అని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మించిన సినిమాలకి సహ నిర్మాతగా వ్యవరించాడు అశీష్. మరి నిర్మాతగా సెటిల్ అవుతాడనుకుంటే ఇప్పుడిలా హీరోగా ఎంట్రీ ఇవ్వడం  అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: