తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా పరిచయం అయ్యింది హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్తో ఆమె అనేక సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ అమ్మడుకు జబర్దస్త్లో రీప్లేస్మెంట్ లేదని ఇంతకాలం భావించినా ఇప్పుడు మరో యాంకర్తో ఆమె ప్లేస్ భర్తీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు షో నిర్వహించే మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ ఇప్పుడు వెండితెరపై వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా పవన్ కళ్యాన్ మూవీలో కూడా ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సుకుమార్ - బన్ని కాంబినేషన్ లో వస్తున్న మరో మూవీలో అనసూయ నటిస్తుంది.
యాంకర్ అనసూయ తన అందచందాలతో ఆకట్టుకోగా.. అదే స్థాయిలో ఆమెకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు బుల్లితెర మరో స్టార్ యాంకర్ మంజూషను ప్రవేశపెట్టింది. ఆ కొత్త యాంకర్ లేటెస్ట్గా హైపర్ ఆది స్కిట్ ద్వారా జబర్ధస్త్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మంజూషను లైన్లోకి తీసుకుని రావడంతో అనసూయ జబర్ధస్త్కు దూరమవుతుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు అనసూయ, రష్మీలకు పోటీగా జబర్దస్త్లో ఎవరూ నిలదొక్కుకోలేదు. వాస్తవానికి రష్మి గౌతమ్ వచ్చిన తర్వాత అనసూయ కెరీర్ క్లో జ్ అనుకున్నారు.
కానీ ఎక్స్ ట్రా జబర్థస్ద్ లో రష్మికను పెట్టి.. జబర్ధస్త్ లో అనసూయ కొనసాగుతుంది. ఆ మద్య నాగబాబుతో పాటు అనసూయ మల్లెమాలకు గుడ్ బై చెప్పేస్తుందని ఇటీవల ప్రచారం జరిగినా.. అది జరగలేదు. నాగబాబు అదిరింది ప్రోగ్రామ్ లో కొంత మంది జబర్దస్త్ నటులు కూడా వెళ్లారు. అయితే ప్రముఖ చానెల్స్లో యాంకరింగ్ చేసిన మంజూష సినిమాల్లో కేరక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించింది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లిగా ఈమె కీలక పాత్రలో చేసింది.