మాటల మాంత్రికుడు త్రివిక్రం లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సంచలన విజయం అందుకుంది. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లు రాబడుతుంది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ స్టామినా ఏంటో ప్రూవ్ అయ్యింది. కరెక్ట్ సినిమా పడితే బన్ని కూడా బాక్సులు బద్ధలు కొట్టే హిట్టు కొడతాడని ప్రూవ్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ తో మూవీ చేస్తుండగా త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వస్తుందని తెలుస్తుంది.

 

అల వైకుంఠపురములో సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది సినిమాకు కావాల్సిన గ్లామర్ ఇచ్చిన పూజా హెగ్దె తన అందంతో అదరగొట్టిందని చెప్పొచ్చు. ఇక సినిమాలో మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ కూడా నటించిందన్న విషయం తెలిసిందే. సుశాంత్ ను ప్రేమించిన మరదలి పాత్రలో నివేదా నటించింది. అయితే ఆమెకు అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇవ్వలేదని చెప్పొచ్చు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, చిత్రలహరి సినిమాల్లో నటించిన నివేదా పేతురాజ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అలాంటిది ఆమెను ఏదో సైడ్ రోల్ ఇచ్చినట్టుగా చేశాడు త్రివిక్రం.

 

అందుకే ఆమెకు చేసిన అన్యాయానికి తారక్ తో చేసే సినిమాలో సెకండ్ లీడ్ గా ఛాన్స్ ఇస్తున్నాడట. అల వైకుంఠపురములో సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా ఆమె నటన మెచ్చిన త్రివిక్రం మళ్లీ మళ్లీ ఛాన్సులు ఇవ్వాలని అనుకుంటున్నాడట. తారక్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్టు అంటున్నారు. సెకండ్ హీరోయిన్ గా మాత్రం నివేదా ఫిక్స్ అట. మరి ఎన్.టి.ఆర్ సినిమాతో అయినా నివేదా పేతురాజ్ ప్రతిభ అందరికి తెలుస్తుందేమో చూడాలి. ప్రస్తుతం తెలుగులో మరో రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అవి కూడా ఒకే అయితే నివేదా పేతురాజ్ తెలుగులో సెటిల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: