ఒక హీరోని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంచ్ చేశారంటే రెండు సినిమాలు ఫ్లాపైనా ఆ హీరో ఖచ్చితంగా ఇండస్ట్రీలో సెటిలవుతాడు. అందుకు అక్కినేని నాగ చైతన్యనే ఉదాహరణ. జోష్ సినిమాతో దిల్ రాజు చైతూని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైతు స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ను కూడా హీరోగా లాంచ్ చేసే బాధ్యతని సూపర్ స్టార్ ఫ్యామిలి దిల్ రాజుకే అప్పగించింది. అందుకే దిల్ రాజు నిర్మాణంలో గల్లా అశోక్ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదే సినిమాని దిల్ రాజు రాజ్ తరుణ్ తో ఇద్దరిలోకం ఒకటే పేరుతో నిర్మించగా ఆ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఇక శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ హీరోగా మరో డెబ్యూ సినిమాను ప్రారంభించారు.  అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాను గల్లా ఫ్యామిలీ నిర్మిస్తున్నారు.

 

ఈ సినిమాను గత  సంవత్సరం నవంబర్ లో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లాంచింగ్ సమయంలో హడావుడి జరిగింది కానీ తర్వాత ఇప్పటి వరకూ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ని చిత్ర యూనిట్ ఇవ్వలేదు. అసలు ఈ సినిమా షూటింగ్ మొదలైందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి కమిటయిన హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉంది. కానీ గల్లా అశోక్ సినిమా గురించి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. గల్లా అశోక్ సినిమా లాంచ్ కార్యక్రమం లైవ్ ఇచ్చి మరీ సినిమాకు భారీగా పబ్లిసిటీ చేశారు. 

 

కానీ తర్వాత అప్డేట్స్ ఇవ్వకపోవడంతో ఏం జరుగుతోందనేది మహెష్ ఫ్యాన్స్ కి అంతు చిక్కడం లేదు. ఇక ఎకే ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ బాబు సినిమా చేయడంతో ఆ బ్యాడ్ లక్ మహేష్ బాబుకే కాదు ఫ్యామిలీ మెంబర్లకు కూడా అంటుకుందని కొందరు ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారని తాజాగా వచ్చిన న్యూస్. అయితే అసలు ఈ సినిమాకు ఎకే ఎంటర్టైన్మెంట్స్ కి సంబంధమే లేదు. మరి ఎందుకు ఈ రెండిటికి లింక్ పెడుతున్నారు అంటూ జనాలకి సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఎకే ఎంటర్టైన్మెంట్స్ స్లీపింగ్ పార్ట్నర్స్ ఆ అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం కలర్ ఉంటే సరిపోతుందా ..సూపర్ స్టార్ మేనల్లుడు హీరో కాగలడా ..కాస్తైనా ఆలోచించక్కర్లా ..అంటూ కామెంట్స్ చేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: