సమంత మొదటి సినిమా ఏం మాయచేశావే సినిమా నుండి ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించినా అందులో సమంత ని తప్ప ఇంక వేరే ఏ హీరోయిన్ ని జనాలు ఊహించుకోలేరు. అసలు సమంత పోషించిన పాత్రలో ఇంకో హీరోయిన్ అనే ఇమాజినేషన్ వస్తేనే చి చి అనుకునేలా వామ్మో అనుకునేలా జనాలని మాయ చేస్తుంది. ఇక 'రంగస్థలం' సినిమాలో ‘రామలక్ష్మి’ పాత్ర ని ఎప్పటికి ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో తాజాగా విడుదల కాబోతున్న ‘జాను’లో ‘జాను’ పాత్ర కూడా అలా గుర్తుండిపోతుందని సమంత ధైర్యంగా చెబుతున్నారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన జాను సినిమా విడుదల సందర్భంగా.. సమంత చిత్ర విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సమంత పంచుకుంది.
‘నా సినిమా ప్రయాణానికి పదేళ్లు. మహా అయితే మరో రెండేళ్లు నటిస్తానేమో. ఆ తర్వాత కూడా నా గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ‘జాను’ లాంటి పాత్రలో నటించాను. జాను సినిమాలోని రామ్, జాను పాత్రలు మీతో పాటు ఇంటికి వస్తాయి. కొన్నాళ్లపాటు మిమ్మల్ని వెంటాడతాయి. ఆ భరోసా నాది’ అని జాను సినిమా గురించి సమంత సంబరపడుతూ చెప్పారు.
తాను ఈ సినిమా చేయకపోయి ఉంటే మంచి అనుభూతిని, అనుభవాన్ని కోల్పోవాల్సి వచ్చేదని సమంత వెల్లడించారు. ‘నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానంటే అది సాధించి తీరాలన్న పట్టుదలతో ఉండేదాన్ని. కామర్స్లో వందశాతం మార్కులొస్తాయని అనుకున్నా. కానీ ఒక్క మార్క్ తగ్గేసరికి కిందపడి ఏడ్చేశాను. మా అమ్మేమో ఫెయిల్ అయ్యిందేమో అనుకున్నారట. అసలు విషయం తెలిసి షాయ్యారు. సినిమాల్లోకి వచ్చాక కూడా నా తీరు మారలేదు’ అని చదువుకునే రోజుల్ని, అప్పటి మధురానుభూతులని గుర్తు చేసుకున్నారు. ఇక ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్లో తాను రొటీన్కు భిన్నంగా విలన్ రోల్లో కనిపించనున్నట్టు చెప్పి తన అక్కినేని ఫ్యాన్స్ కి షాకిచ్చారు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్లో ఫైట్స్ కూడా చేశానని, ఒక్క ఫైట్లో కూడా డూప్ లేకుండా చేసినట్టు సమంత ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.