టెలివిజన్ షోస్ ఎక్కువగా ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కరలేని పేరు శ్రీముఖి. ఆమె యాంకర్ గా చేసిన ప్రోగ్రామ్స్ ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. యాంకర్ గా తనకి ఉన్న పాపులారిటీతో అప్పుడప్పుడు అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తుంది. యాంకర్ గా బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ ౩ ఫైనలిస్ట్ గానిలిచి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే బిగ్ బాస్ ద్వారా మరింత మందికి చేరువైన శ్రీముఖి అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.

 

 


దాంతో అప్పటి నుండి ఆమెని ఫాలో అయ్యే నెటిజన్లు కూడా పెరిగారు. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఆమె పాపులారిటీ పెరగడంతో కొన్ని ఇబ్బందులకి గురవుతోందట. తన అభిమానులు ఎక్కడెక్కడి నుండో ముందస్తు సమాచారం లేకుండా వచ్చి తనతో ఫోటోలు దిగడం తనని బాగా ఇబ్బందికి గురి చేస్తోందట. చాలా సార్లు వస్తున్నామని అపాయింట్ మెంట్ తీసుకోకుండానే వచ్చి ఆమెతో ఫోటోలు దిగుతామని చెప్పడం అసహనానికి గురి చేస్తోందట.

 

 

తాజాగా దీనిపై శ్రీముఖి తన వివరణని ఇచ్చింది.  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. మీరంటే మాకిష్టమని ఎక్కడెక్కడినుంచో తమ ఇంటికి వస్తున్నారని.. అలాంటి వారు సమయం.. సందర్భం చూసుకోకుండా రావటం ఇబ్బందిగా మారినట్లు చెప్పారు. తమను ప్రేమించి.. అభిమానించే అభిమానులు ఉండటం నిజంగానే లక్కీ అని.. అలాంటి అభిమానుల కోసమే తాము మేకప్ లు వేసుకొని టీవీ ముందుకు వచ్చి అలరిస్తున్నట్లు చెప్పారు. 

 

 

అయితే వేళకాని వేళలో, టైమ్ కాని టైమ్ లో వచ్చి ఫోటో దిగుతామని అంటే ఇబ్బంది ఉండదా అని ప్రశ్నించింది. ముందస్తు సమాచారం ఇచ్చి కలుస్తామని అంటే బాగుంటుందని, అప్పుడు ఫోటోలే కాదు కొంచెం సేపు మాట్లాడుకోవచ్చు కూడా అని చెప్పింది. మొత్తానికి అభిమానుల పట్ల ఎలా ఉండాలో.. తన సొంత విషయాల పట్ల ఎలా ఉండాలో శ్రీముఖికి బాగానే తెలిసినట్లుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: