ఈ మద్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. చిత్ర నిర్మాతలకు గుండెల్లో దడపుడుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యక్షం కావడం కామన్ అయ్యింది.  ఎన్నో వ్యవప్రయాసలకు ఓర్చి ఓ సినిమా తెరకెక్కిస్తే.. గంటల వ్యవధిలోనే పైరసీ చేసి నెట్ లో పోస్ట్ చేస్తున్నారు.  ముఖ్యంగా తమిళ రాకర్స్ చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా రిలీజ్ సమయంలోనే నిర్మాణ సంస్థలకు చెప్పి మరీ ఈ పైరసీలు చేస్తుంటారని ఆ మద్య వార్తలు వచ్చాయి. ప్రతిసారి ప్రభుత్వానికి సినీ నిర్మాణ సంస్థలు ఈ పైరసీ రక్కసిని రూపుమాపాలని అర్జీలు పెడుతూనే ఉన్నారు.  కాకపోతే వేరు వేరే సైట్స్ లో ఈ దారుణానికి పాల్పపడుతున్నారు పైరసీదారులు. 

 

ఈ రోజు శర్వానంద్, సమంత నటించిన ‘జాను’ మూవీ రిలీజ్ అయ్యింది. సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శర్వానంద్ రామ చంద్రన్ పాత్ర పోషించగా, జానుగా సమంత నటించింది. ఈ ఇద్దరి నటన బాగా ఆకట్టుకుందని, డైరెక్టర్ టేకింగ్ అదుర్స్ అనే టాక్ బయటకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం చిత్రయూనిట్‌ని కంగారు పెడుతోంది.  మొదటి షో పూర్తయ్యేసరికి జాను పైరసీ బయటకొచ్చి ఆన్‌లైన్‌ వేదికపై షికారు చేస్తోంది. ఇది చూసి ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసుకొని సినిమా చూస్తున్నారు.

 

దీంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడుతుందని తెలుస్తోంది. పైరసీ విషయంలో చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు పడుతున్నా వారి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.  అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అయినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ పైరసీ భూతం వెంటాడుతూనే ఉంది. ఏ ఒక్క సినిమాను కూడా వదలక పోవడంతో సినీ లోకం తీవ్ర నిరాశ చెందుతోంది.   తాజాగా ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది... మరి కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి 

మరింత సమాచారం తెలుసుకోండి: