యంగ్ హీరో విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవన్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ' వరల్డ్ ఫెమస్ లవర్ ' .. ఈ చిత్రంలో రాశి ఖన్నా ,కేథరిన్ ,ఐశ్వర్య రాజేశ్, ఇజబెల్లా కథానాయికలు నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలయిన పోస్టర్స్ , టీజర్,సాంగ్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది.
తాజాగా ఈ చిత్రం నుండి మరో ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ..ఈ ప్రపంచంలో నిస్వార్ధమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమొకటే అనే డైలాగుతో మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అన్నీ కార్యక్రమాలను త్వరత్వరగా పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. అయితే ఈ సందర్బంగా రాశిఖన్నా మాట్లాడుతూ.. విజయ్, నలుగురు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీస్.? వారి మధ్య ఎమోషన్స్..
వారు వదిలి వెళ్ళిపోయిన తర్వాత విజయ్ అనుభవించిన పెయిన్.? లాంటి విషయాలన్నీ కూడా ట్రైలర్లో ఎలివేట్ చేసింది. మొత్తానికి ఈ సినిమా టీజర్ సోసోగా ఉన్నా.. విడుదలైన ట్రైలర్ మాత్రం చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది. లాస్ట్లో ‘నా గుండెకు తగిలిన దెబ్బకు.. ఆ బాధ తెలియకుండా ఉండాలంటే.. ఫిజికల్గా ఈ మాత్రం పెయిన్ ఉండాలని విజయ్ చెప్పే డైలాగు అద్భుతంగా ఉంది.అయితే ఈ సినిమా మొత్తానికి రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా ఉంటుంది.
డియర్ కామ్రేడ్ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ చిత్రం విజయ్ కు సక్సెస్ ను అందిస్తుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. కాగా, వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది... మరి ఈ సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి మరి..