టాలీవుడ్ లోకి మాలీవుడ్ బ్యూటీలు వరుసగా వస్తూ.. మంచి విజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రామ్ హీరోగా నటించిన నేను శైలజ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది నటి కీర్తి సురేష్. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘నేను లోకల్ ’ మూవీతో మరో విజయం అందుకుంది. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా ఉండే కీర్తి సురేష్ యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. మహానటితో జాతీయ అవార్డు అందుకున్న హీరయిన్ కీర్తి సురేష్. ఈ సినిమా తర్వాత పెద్దగా హడావిడి లేకుండా ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది.
తాజాగా కీర్తి మిస్ ఇండియా అనే సినిమా చేస్తుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదల విడుదల చేసిన టీజర్ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘కొత్తగా కొత్తగా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో నవీన్ చంద్ర, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, నరేష్, భానుశ్రీ మెహ్రా (వరుడు) ఫేమ్ కీలక పాత్రధారులు. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాశారు. మెలోడి క్వీన్ శ్రేయా ఘోషల్ అద్భుతంగా పాడారు.
ఈ మూవీ లో కీర్తి సురేష్ కాస్త సన్నబడ్డట్టు కనిపిస్తుంది. కాన్సెప్ట్ కాస్త కొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. మరీ ఈ మూవీతో కీర్తి సురేష్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటుందా అని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఈ మూవీ కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 6న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కమల్ కామరాజు, నదియా, పూజిత పొన్నాడ తదితరలు నటిస్తున్న ఈ చిత్రానికి రచన : నరంద్రనాధ్, తరుణ్, మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రఫీ : డానీ సాంచేజ్- లోపెజ్, వంశీ.పి, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : సాహి సురేష్.