టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట కథ, మాటల రచయితగా అడుగుపెట్టిన త్రివిక్ర్రమ్ శ్రీనివాస్, ఆ తరువాత యంగ్ హీరో తరుణ్, శ్రియ ల కలయికలో అప్పట్లో వచ్చిన నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా మారారు. మంచి ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా, బాగానే సక్సెస్ ని సాధించింది. ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో ఆయన తీసిన అతడు సినిమా, పెద్ద హిట్ కొట్టి, ఇప్పటికీ కూడా మంచి క్లాసిక్ హిట్ గా కొనసాగుతూనే వుంది. ఆపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన జల్సా సినిమా కూడా మంచి హిట్ కొట్టి, టాలీవుడ్ లో దర్శకుడిగా త్రివిక్రమ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జులాయి తీసి మరొక హిట్ కొట్టిన త్రివిక్రమ్ కు ఆ తరువాత కొన్ని హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి. 

 

ఇక రెండేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆయన తీసిన అజ్ఞాతవాసి సినిమా ఘోర పరాజయాన్ని అందుకొవడంతో, ఆపై ఎన్టీఆర్ తో తీయనున్న అరవింద సమేత ను ఎంతో దృష్టి పెట్టి తీశారు త్రివిక్రమ్, అయితే ఆ సినిమా మొత్తానికి బాగానే ఆడి, త్రివిక్రమ్ కి బ్రేక్ ని ఇచ్చింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా ముచ్చటగా మూడవసారి బన్నీతో ఆయన తీసిన అలవైకుంఠపురములో సినిమా హిట్ సాధించి త్రివిక్రమ్ పేరును మరింత పెంచింది. అయితే అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన తీయనున్న 'అయినను పోయిరావలె హస్తినకు' సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. 

 

నిజానికి అంతకముందు ఎన్టీఆర్ తో ఆయన తీసిన అరవింద సమేత సినిమా, ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అనే చెప్పాలి, అందులో త్రివిక్రమ్ మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్, పంచ్ డైలాగ్స్ వంవిటి పెద్దగా లేనేలేవనే టాక్ అప్పట్లో బాగా వినపడింది. కావున అతి త్వరలో మరొక్కసారి ఎన్టీఆర్ తో తీయనున్న తదుపరి సినిమా తప్పకుండా పక్కా త్రివిక్రమ్ మార్క్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయి ఉండాలని అంటున్నారు ఫ్యాన్స్. మరి త్రివిక్రమ్ ని ఎంతో గౌరవంగా స్వామి అని పిలిచే ఎన్టీఆర్ కు ఈసారైనా తన మార్క్ సినిమాని త్రివిక్రమ్ అందిస్తారో లేదో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: