టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు బాలీవుడ్ మూవీ పింక్ అధికారిక తెలుగు రీమేక్ తో పాటు మరోవైపు క్రిష్ జాగర్లమూడి సినిమాలలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే పింక్ రీమేక్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, క్రిష్ సినిమా షూటింగ్ లో అతి త్వరలో పవన్ జాయిన్ కానున్నారు. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసితో సినిమాలకు దూరం అయి, తన రాజకీయ జీవితంలో పూర్తిగా బిజీ అయిన పవన్, ఎట్టకేలకు కొన్నాళ్లుగా మళ్ళి సినిమాల్లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ చేస్తున్న అభ్యర్ధన మేరకు చివరికి టాలీవుడ్ కి నటుడిగా పునఃప్రవేశం చేసారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న పింక్ తెలుగు రీమేక్ కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

పవన్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే దీనితో పాటు పవన్ నటించబోయే క్రిష్ జాగర్లమూడి సినిమాలో ఆయన ఒక గజదొంగ పాత్రలో నటించనున్నారని, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవన్ నటిస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. అయితే నిన్నటి నుండి పవన్ నటిస్తున్న ఈ సినిమాల విషయమై ఒక వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. పవన్ ఈ రెండు సినిమాలకు గారు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడంతో పాటు ఆయన అనుచరులు, పర్సనల్ సెక్యూరిటీకి కూడా భోజనం ఖర్చులు వంటి అన్ని సౌకర్యాలను ఆయా నిర్మాణ సంస్థలు పెట్టుకోవాల్సి వస్తోందని, 

 

అలానే షూటింగ్ నిమిత్తం మధ్యలో విజయవాడ నుండి హైదరాబాద్ వస్తూ పోతూ ఉన్న పవన్ తోపాటు ఆయన సెక్యూరిటీ వారు వాడుతున్న కార్లకు డీజిల్ వంటివి కూడా ఆ సంస్థలే భరిస్తున్నాయని, ఇది ఒకరకంగా నిర్మాతలకు ఎంతో పెను భారంగా తయారయిందని, ఇది ఇలాగే కొనసాగితే నిర్మాతలకు షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి భారీ మూల్యం సమర్పణ తప్పదని, అయితే ఆ విషయాలను బయటకు చెప్పుకోలేని నిర్మాతలు అలాగే సర్దుకుపోతున్నారని అంటున్నారు. కాగా దీనిపై ఎక్కడా కూడా అధికారికంగా సమాచారం లేనప్పటికీ, నిన్నటి నుండి ఈ వార్త అటు సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేస్తోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాల్సి ఉంది...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: