దిగ్గజ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా RRR. 'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ స్థాయి లోనే కాక అంతర్జాతీయ స్థాయి లోనే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కాగా సినిమా స్టార్టింగ్ సమయములో ఈ ఏడాది జూన్ నెలాఖరులో సినిమా విడుదలవుతుందని ప్రకటించిన రాజమౌళి ఇటీవల అధికారికంగా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అవుతుందని చెప్పటంతో మెగా అభిమానులు మరియు నందమూరి అభిమానులు తీవ్ర స్థాయిలో రాజమౌళి చెప్పిన ప్రకటనపై నిరుత్సాహం చెందారు.

 

మొట్టమొదటిసారి నందమూరి ప్లస్ మెగా కుటుంబాలకు చెందిన హీరోలు నటించడంతో ఈ సినిమా జూన్ మాసంలోనే విడుదలవుతుందని ఆశపడ్డ ఇద్దరు హీరోల అభిమానులు ఒక్కసారిగా వచ్చే ఏడాది సంక్రాంతి అనేసరికి డీలా పడ్డారు. ఏది ఏమైనా సినిమా హిట్ పడితే చాలునని కోరుతున్నా ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ 'పంజా' సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా 'RRR' సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత శోభు యార్లగడ్డ ఏమన్నారంటే ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించి తనకు కథ గురించి ఏమి తెలియదని కానీ, ఒక రోజు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కి వెళ్లానని తెలిపారు.

 

అయితే ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ పక్కా అని సంకేతాలు ఇచ్చారు. బాహుబలి చిత్రం తో తెలుగు సినిమా ని ప్రపంచ స్థాయిలో కి తీసుకెళ్లిన రాజమౌళి ఈ చిత్రాన్ని కూడా అదే తరహా లో తీసుకు వెళ్ళటం గ్యారెంటీ అని తెలిపారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు జనవరి ఎనిమిదవ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర తరాలైన అజయ్ దేవగన్, అలియా భట్ లు నటిస్తుండగా హాలీవుడ్ తార ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: