టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో తనకంటూ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు నాగ శౌర్య. ఊహలు గుసగుసలే సినిమాతో అదిరిపోయే ఫస్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య...ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాగశౌర్య అమ్మాయిల హృదయాలను గెలుచుకున్న లవర్ బాయ్ గా అద్భుతమైన ప్రేమకథలు చేసుకుంటూ వచ్చారు. కెరియర్ లో అప్ అండ్ డౌన్స్ చూసిన నాగశౌర్య మొన్నటి వరకు 'అశ్వథ్థామ' సినిమా రిలీజ్ ముందు వరకు చేసిన సినిమాలు చాలా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం నాగశౌర్య తన సినిమా స్టోరీ 'అశ్వథ్థామ' తానే రాసుకుని సినిమా చేయడం జరిగింది. మాస్ ఎలివేషన్ కథతో తనని తాను సిల్వర్ స్క్రీన్ పై తన స్టోరీతో అద్భుతంగా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని అద్భుతంగా చూపించాడు నాగ శౌర్య.

 

ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఉష ముల్పూరి నిర్మించిన 'అశ్వథ్థామ' జనవరి నెలాఖరున విడుదల అయ్యి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాగశౌర్య కెరీర్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాలో నాగ శౌర్య పక్కన హీరోయిన్ గా మెహ్రీన్ జంటగా నటించడం జరిగింది. ఇండస్ట్రీకి కొత్త దర్శకుడిగా పరిచయమైన రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విషయమై నాగశౌర్య పై కేసు నమోదు అయినట్లు సమాచారం.

 

మేటర్ లోకి వెళ్తే  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డ్రైవర్ల పట్ల నాగశౌర్య అవమానకరంగా మాట్లాడారని శౌర్య పై తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. చదువుకోని కొంత మంది వ్యక్తులు డ్రైవర్ వృత్తిని ఎన్నుకుంటారని మద్యానికి బానిసై నేరాలు పాల్పడుతారని వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా హీరో నాగ శౌర్య కామెంట్లు చేయడంతో వెంటనే క్షమాపణ కోరాలని తెలంగాణ రాష్ట్ర టాక్సీ డ్రైవర్స్ జేఏసీ డిమాండ్ చేస్తోంది. మరి ఈ విషయంపై నాగశౌర్య స్పందిస్తారో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: