తెలుగు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుని స్టార్ కధానాయికగా మారిన సాయి పల్లవి ఓ మళయాళీ అమ్మాయి అంటే నమ్మలేం. అంతగా తెలుగు సినిమాల్లో పేరును.. ప్రేక్షకుల్లో అభిమానాన్ని సంపాదించుకుంది. తెలుగుతోపాటు తమిళ, మళయాళంలో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. సెలెక్టెడ్ స్క్రిప్ట్స్ చేస్తూ మంచి సంపాదన ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఇదే సాయి పల్లవికి ఓ అలంకారాన్ని, గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ జాబితాలో సాయి పల్లవి చోటు దక్కించుకుంది.

 

 

ప్రతి ఏటా ఫోర్బ్స్ 30 అండర్ 30 పేరుతో జాబితా ప్రకటిస్తారు. వివిధ రంగాల్లో 30 ఏళ్ల వయసు లోపు యువతీ యువకుల్లో వారు సాధించిన విజయాలు, సాధిస్తున్న విజయాల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటిస్తారు. ఇందులో భాగంగా దక్షిణాది నుంచి సినిమాల్లో ఈ ఏడాదికి గౌరవం దక్కించుకుని సెన్షేషన్ క్రియేట్ చేసింది. నటనకు అవకాశం ఉండి.. తన పాత్రకు న్యాయం చేయగల పాత్రలే ఎంచుకుంటుందనే పేరు సాయి పల్లవి సొంతం. ‘నాకు నటించడం రాకపోయినా ప్రేక్షకులు ఇచ్చిన ధైర్యమే నన్ను ముందకు నడిపిస్తోంది. ఈరోజు సాధించిన ఈ ఘనతకు కారణం వారే. నన్ను, నానటనను వాళ్లు అంగీకరించబట్టే. ఫోర్బ్స్ 30 అండర్ 30లో స్థానం సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను’ అని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

 

 

2018లో శర్వానంద్ తో నటించిన పడిపడి లేచె మనసు సినిమా ఫ్లాప్ కావటందో తన రెమ్యునరేషన్ లో సగం నిర్మాతకు తిరిగి చెల్లించిన గొప్పదనం కూడా ఈమె సొంతం. హీరోలు మాత్రమే చేసే ఇటువంటి సాయాన్ని ఓ హీరోయిన్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమై సాయి పల్లవికి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది ఈ రౌడీ బేబీ.

మరింత సమాచారం తెలుసుకోండి: