నూతన దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, మేహరీన్ జంటగా నటించిన సినిమా 'అశ్వథ్థామ'. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేష‌న్స్ లో శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి ఈ సినిమాను నిర్మించారు. మొదటిసారి యాక్షన్ జోనర్ తో నాగశౌర్య నటించిన ఈ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు శౌర్య తన సొంత బ్యానర్ లో ఛలో, నర్తనశాల, ఇప్పుడు 'అశ్వథ్థామ' సినిమాలు తీశారు. వాటిలో ఛలో మంచి హిట్ టాక్ ని తెచ్చుకొని మొదటి సినిమాగా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన నర్తనశాల మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో ఒక సినిమాతో వచ్చిన క్రేజ్, డబ్బు మొత్తం పోయింది. దాంతో మళ్ళీ మొదటి సినిమా స్థాయి హిట్ కొట్టాలని శౌర్య 'అశ్వథ్థామ' సినిమాని చేశాడు. 

 

 ఛలో తర్వాత శౌర్య సినిమాలన్ని వరుస బెట్టి ఫ్లాపవుతూ వచ్చాయి. దాంతో చిన్న గ్యాప్ తీసుకొని 'అశ్వథ్థామ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2020 లో తను ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. యూత్ ఆడియన్స్ లో ఒక మోస్తారు క్రేజ్ ఉన్న నాగశౌర్య ఈ సినిమాతో అది కూడా పోగొట్టుకున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కథకు అనుకున్న ప్లాట్ పెద్ద మైనస్ అని అందరూ అంటున్నారు. ఏమాత్రం ఆసక్తి కరంగా సాగని కథనం తో ప్రేక్షకులకు సినిమా చూసింత సేపు చిరాకు తెప్పించాడని చెప్పుకున్నారు.

 

అంతేకాదు ఎన్నో అంచనాలు పెట్టుకున్న నాగశౌర్య కి ఈ సినిమా కూడా నిరాశపరచింది. ఇప్పటి వరకు క్లాస్ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న శౌర్య మొదటిసారి అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ తో కాస్త యాక్షన్ సినిమా జోలికి వెళ్ళి గట్టి దెబ్బే తిన్నాడు. కానీ ఇంకా ఏదో చేఅయలని తాజాగా సక్సస్ మీట్ ని నిర్వహించారు. 'అశ్వథ్థామ' కి శౌర్య రాసిన కథ బాగా వర్కౌట్ అయిందని ఇకపై కూడా తను కథలు రాయాలని దర్శకులారు నందిని రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఆమే అలా అన్నారో లేదో వెంటనే నెటిజన్స్ ఏకిపారేయడం మొదలు పెట్టారు. ఇంకా కథలు రాసి ఎవరి ప్రాణాలు తీస్తావ్ ..ఇప్పటికి తీసింది సరిపోదా అశ్వద్ధామ తో ఎంతమంది బలైయ్యారో తెలుసా ....! అంటూ తిట్టిపోస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: