టాలీవుడ్ చుల్ బులి సమంత అక్కినేని, ఫస్ట్ సినిమామాయ చేసావే నుండి, మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాను వరకు కూడా చాలా వరకు తాను నటించిన సినిమాలతో సక్సెస్ లు అందుకుంది అనే చెప్పాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏ మాయ చేసావే అద్భుత విజయంలో సమంత పాత్ర ఎంతో ఉందనే చెప్పాలి. ఆ సమయంలో సమంత కోసమే ఎన్నో సార్లు ఆ సినిమా చూసిన కుర్రకారు ఉన్నారంటే, తొలి సినిమాతోనే సమంత ఎంత పేరు సంపాదించిందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం, పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ కొట్టిన సమంత, కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకుంది. ఇక ఇటీవల ఆమె శర్వానంద్ తో కలిసి నటించిన జాను సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే గత ఏడాది ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యూ టర్న్, ఓ బేబీ సినిమాలు మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం జాను కూడా సక్సెస్ కొట్టి సమంతకు మరింతగా లక్కీ హ్యాండ్ అనే పేరు తెచ్చిపెట్టింది. 

 

ఇక జాను స‌క్సెస్ మూమెంట్‌తో విదేశాల‌కు వెళ్లి వారం రోజులు చైతుతో క‌లిసి ఎంజాయ్‌ చేయాలని డిసైడ్ అయిందట సమంత. ఈ సినిమా సక్సెస్  సందర్భంగా చైతు ఆమెకు ప్రత్యేక ట్రీట్ ఇవ్వనున్నారట. ఎటువంటి ఫైట్స్, గొడవలు, కమర్షియల్ హంగులవంటివి లేకుండా, కేవలం ఆకట్టుకునే కథ కథనాలతో పాటు, హీరో హీరోయిన్లిద్దరి సహజ నటన జాను సినిమా సక్సెస్ కు కారణంగా నిలిచాయని చెప్పాలి. ఇటీవల తమిళ్ లో వచ్చిన 96కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం భర్తతో విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన అనంతరం తన నెక్స్ట్ మూవీ ని ప్రకటిస్తాను అంటోంది సమంత.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: