రాజమౌళి రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. బాహుబలి లాంటి అద్భతమైన చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచింది ఆ చిత్రమే. ఆ చిత్రాన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. ఇది అన్ని భాషల్లోనూ అత్యధిక కలెక్షన్ల వర్షం కురిపించింది. రాజమౌళి హీరోలను పెట్టి సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆఖరికి ఈగతో కూడా సినిమా తీసి హిట్ కొట్టొచ్చు అని కొత్త ప్రయత్నం చేశారు. ఆఖరికి అది కూడా మంచి సక్సెస్ సాధించిందనే చెప్పాలి.
మనుషులతోనే కాదు కథ కథనాలు బాగా కుదిరితే ఈగలతో కూడా మంచి చిత్రాన్ని సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రాజమౌళి. ఇక ఇదిలా ఉంటే...ప్రతస్తుం ఆయన మరో ప్యాన్ ఇండియా చిత్రం తెరకెక్కించే పనిలో పడ్డారు. అదేమిటంటే రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా మల్టీస్టారర్గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఈ చిత్రాన్ని కూడా అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.
మరి ఈ చిత్రం కూడా అన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఆల్రెడీ ఇప్పటికే ప్రీరిలీజ్ బిజినెస్ కూడా మొదలయింది. ఇక దీని కోసం నైజం రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్రాజు పెద్ద మొత్తంలో కొన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీలో ముందు వరుసలో ఉన్నాది ప్రముఖ నిర్మాత కరణ్ జొహర్ పాట్లు పడుతున్నారు. బాహుబలి చిత్రాన్ని అక్కడ విడుదల చేసి మంచి కలెక్షన్లు సాధించిన కరణ్ ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా అక్కడ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దీనికి రాజమౌళి ఓకే చెపుతారా అలాగే దీన్ని అక్కడ రిలీజ్ చేయడానికి ఎంత పెట్టుబడి పెడతున్నారు అన్న విషయాలు తెలియాల్సి ఉంది.