సినిమా స్టార్స్ తో పాటు స్టార్ క్రీడాకారులకు కోట్ల రూపాయలు ధారపోసి తమ కంపెనీల ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్న కంపెనీలకు కేంద్రం భయంకరమైన షాక్ ఇచ్చింది. టీవీలో,  థియోటర్స్ లో యాడ్స్ ఇష్టమొచ్చినట్టు ఇచ్చి ప్రజలను మోసం చేసినట్లయితే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాని అమలులోకి తీసుకు వచ్చింది. ఈ క్రీమ్ రాసుకుంటే నల్లగా ఉన్న మీరు తెల్లగా అవుతారు.. ఇది తీసుకుంటే మీరు లావు అవుతారు.. అది తాగితే మీకు తెలివి బాగా వస్తుంది అంటూ తమ కంపెనీ బ్రాండ్స్ కు స్టార్స్ తో సూపర్ స్టార్స్ తో పబ్లిసిటీ చేస్తున్న కంపెనీలు ఇప్పటి నుంచి జనాలను మాయచేసే అలాంటి యాడ్స్ ను ఆపేయాల్సిందేనని హెచ్చరించింది.

 

ఈమద్య కాలంలో పలానా కంపెనీ యాడ్ చూసి ఆ ప్రొడక్ట్ ను వాడాను.. కాని యాడ్ లో చూపించిన విధంగా నాకు ఆ ప్రోడక్ట్ మేలు చేయలేదు అంటూ పోలీసు స్టేషన్స్ లో కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం 1954 నుండి అమలులో ఉన్న చట్టంలో మార్పులు తీసుకు వచ్చింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలతో తమ ప్రాడెక్ట్స్ ను ప్రజల్లోకి తీసుకు వెళ్లే కంపెనీల పై కఠిన చర్యలతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

 

కేంద్రం కొత్త చట్టం ప్రకారం మొదటి సారి అలాంటి అబద్దపు, మోసపూరితమైన యాడ్స్ ను ప్రసారం చేస్తే రెండు సంవత్సరాల జైలు శిక్ష.. 10 లక్షల జరిమానా విధించనున్నారు. మళ్లీ మళ్లీ అదే తప్పును ఆ కంపెనీలు చేస్తే జైలు శిక్ష తో పాటు జరిమానా పెరుగుతూ పోతుంది. ఆ కంపెనీలకు మాత్రమే కాకుండా ఆ యాడ్స్ లో నటించే స్టార్స్ లేదా మోడల్స్ కు కూడా శిక్ష తప్పదంటూ కేంద్రం తెచ్చిన కొత్త బిల్లులో పొందు పరచారు. కంపెనీల మోసపూరిత యాడ్స్ లో నటించి మాకు సంబంధం లేదు అంటే మాత్రం అసలు వదిలే ప్రసక్తే లేదని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: