ప్రతి మనిషికి సినిమా ఎంత వినోద సాధనమో చెప్పాల్సిన పని లేదు. అలుపెరుగని జీవిత పయనంలో కాస్తంత సమయం వినోదానికి ఇవ్వాలని.. మనసు సేద తీరాలని భావించని వారు ఉండరు. వీరిలో రిక్షా కార్మికుడి నుంచి వ్యవస్థలను నడిపించే అపర కోటీశ్వరులు ఉంటారు. ఇదే విషయాన్ని నిజమని నిరూపిస్తున్నారు.. ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి. దేశంలోనే పెద్దదైన ఐటీ రంగాన్ని స్థాపించి పేరు సంపాదించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్యే సుధా మూర్తి. మన తెలుగు సినిమాల గురించి నటుల గురించి ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘తెలుగు సినిమాల్లో చిన్నప్పటి నుంచీ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. కృష్ణుడు అంటే మనం చూడలేదు. కానీ ఎన్టీఆర్ ని చూస్తే కృష్ణుడిని చూసినట్టే ఉండేది. ఇంకా మాయాబజార్, దానవీరశూరకర్ణ సినిమాలు చూశాను. రీసెంట్ గా రామ్ చరణ్ రంగస్థలం చూశాను. రామ్ చరణ్ అద్భుతంగా నటించి మెప్పించాడు. నాగార్జున అన్నమయ్య, నమో వెంకటేశాయ, మనం సినిమాలు కూడా చూశాను’ అని చెప్పుకొచ్చారు. ఆమె మాటల్లో సినిమాలపై ఆమెకున్న ఇష్టం ఏంటో తెలుస్తోందనే చెప్పాలి. అలనాటి చిత్ర రాజాల నుంచి నేటి తరం సినిమాలను కూడా ఆమె చూస్తున్నారు. అంటే వ్యాపారంలో ఎప్పుడూ ఎలా అప్డేట్ గా ఉంటారో.. వినోద రంగంలో కూడా ఆమె అదే అప్డేట్ గా ఉన్నారని అర్ధమవుతోంది.
ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అంతరాంగాన్ని, సినిమాలపై ఆమెకున్న ఇష్టాన్ని చెప్పుకొచ్చారు. ఇంటర్వూలో ఆమె ఇంగ్లీషులోనే మాట్లాడారు. తెలుగు సినిమాలపై ఆమెకున్న అభిమానానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు, మెగా అభిమానులు, నాగార్జున అభిమానులు ఆమె మాటలకు పులకించిపోతారనడంలో సందేహం లేదు.
Infosys Chairperson sudha Murthy About ram charan rangasthalam Movie#Sudhamurthy #RamCharan #VanithaTV pic.twitter.com/Cv4m4vMua5
— Vanitha tv (@VanithaTvOnline) February 8, 2020