బాహుబలి 2 తరువాత 2018 లో భాగమతి తో  వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది  స్టార్ హీరోయిన్  అనుష్క.. ఆతరువాత మరి కొన్ని ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించి చాలా గ్యాప్ తీసుకుంది. దాంతో ఈ బ్యూటీ  గత ఏడాది ఒక్క సినిమా తో కూడా  ప్రేక్షలముందుకు రాలేకపోయింది. అయితే ఎట్టకేలకు అనుష్క కొన్ని నెలల క్రితం నిశ్శబ్దం అనే  సినిమా కు సైన్ చేయగా నవంబర్ లోనే సినిమా షూటింగ్ పూర్తయింది. 
 
దాంతో సినిమాను  జనవరి  31 నే  విడుదలచేస్తామని ప్రకటించారు  అయితే అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు  పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. ఆతరువాత  సినిమాను ఫిబ్రవరి లో విడుదలచేస్తారని  టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్ విషయం లో క్లారిటీ వచ్చింది.  ఏప్రిల్ 2న  నిశ్శబ్దం విడుదలకానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.   
 
హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో  మాధవన్  ,సుబ్బరాజు,  అంజలి , అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో పాటు హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై  కోన వెంకట్, టిజి విశ్వ ప్రసాద్  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.  ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిశ్శబ్దం ఒకేసారి తెలుగు తోపాటు  తమిళ , మలయాళ ,హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.  ఇక  ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు.  నిశ్శబ్దం విడుదలై విజయం సాధిస్తే తప్ప ఆమె కు మళ్ళీ ఛాన్స్ లు వచ్చేలా లేవు దాంతో నిశ్శబ్దం పై అనుష్క చాలా  ఆశలే  పెట్టుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: