నితిన్ మంచి జోష్ పై ఉన్నాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండ‌గానే, మ‌రో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ప్ర‌స్తుతం భీష్మ‌ని విడుద‌ల చేసే ప‌నిలో ఉన్నాడు నితిన్‌. ఆ పై రంగ్‌దే ఉంది. ఇవి రెండూ కాకుండా – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి సినిమాని త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నాడు. ఈ సినిమాకి ‘చెక్‌’ అనే టైటిల్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. చెస్‌లో ‘చెక్‌’ అనే మాట‌కున్న ప్రాధాన్యం ఏమిటో తెలియంది కాదు. ఈ సినిమా కూడా ఓ చ‌ద‌రంగం ఆట‌లా ఉండ‌బోతోంద‌ట‌. క‌థ‌లో మ‌లుపులు ఆక‌ట్టుకుంటాయ‌ని తెలుస్తోంది. ఇదో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో నితిన్ పాత్ర కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. సినిమాలో దాదాపు 75 శాతం సింగిల్ లొకేష‌న్‌లో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. అంటే.. బ‌డ్జెట్ కూడా ప‌రిమితుల్లోనే ఉండ‌బోతోంది.

 

మ‌రి ఈ సినిమాల కోసం నితిన్ త‌న పెళ్ళిడేట్‌ని కూడా వాయిదా వేసుకున్నాడ‌నే చెప్పాలి. సినిమా పై సినిమాల‌ను చేసుకుంటూ ఫుల్ బీజీగా మారిపోయాడు నితిన్‌. ఇక ఇదిలా ఉంటే కొంత మంది హీరోల‌కి పెళ్ళైతే క‌లిసొస్తుంది అన్న‌ట్లు మ‌న హీరోకి పెళ్ళి ఫిక్స్ అయితేనే చాలు అదృష్ట క‌లిసివ‌చ్చిన‌ట్టు ఉంది. హార్ట్ ఎటాక్ చిత్రం చాలా గ్యాప్ త‌ర్వాత నితిన్ మ‌ళ్ళీ భాష్మ్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నారు. ఇక ఇదిలా ఉంటే...నితిన్, ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తున్న చిత్రం భీష్మ చిత్రంలో వీరిద్ద‌రి కెమిస్ట్రీని బాగా కుదిరింద‌ని తెలుస్తుంది. 

 

తొలిప్రేమ, మజ్నులాంటి చిత్రాలు అందించిన వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో మహనటి కీర్తి సురేష్, నితిన్‌ల కాంబినేషన్‌లో రూపొందే కుటుంబ కథా చిత్రం రంగ్‌దే. చిత్ర నిర్మాత నాగవంశీ తెలిపారు. కాగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. నితిన్‌ హీరోగా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనందప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. నితిన్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, నితిన్‌ తండ్రి సుధాకర్‌రెడ్డి క్లాప్‌ నివ్వగా, వి. ఆనంద ప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: