టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు ఎంతో మంది సినిమా హీరోల తనయులు హీరోలుగా పరిచయం అయ్యారు.  అయితే ఇతర రంగాల్లో ఉన్న వారి కొడుకులు సైతం హీరోలుగా వస్తున్న తరుణంలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు.  కొత్త పరిచయమే భారీ స్థాయిలో జరిగింది.  మాస్ దర్శకులు వివివినాయక్, సమంత హీరోయిన్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం లాంటి స్టార్ నటులతో మంచి కామెడీ కాన్సెప్ట్ తో ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 

 

మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి భవిష్యత్ ఉంటుందని భావించారు.  కానీ ఆ తర్వాత వచ్చిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  తర్వాత బోయపాటి, నివాస్ లాంటి దర్శకులతో సినిమాల్లో నటించినప్పటికీ ఈ యంగ్ హీరోకి అస్సలు కలిసి రాలేదు.  అయితే స్టార్ ప్రొడ్యూసర్ తనయుడు కావడంతో భారీ బడ్జెట్ తోనే సినిమాలు తెరకెక్కాయి.. కానీ ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేక పోయాయి. బెల్లంకొండ అబ్బాయి విషయంలో భారీ ఫైట్ సీన్స్, స్టార్ కాస్టింగ్, ప్రముఖ టెక్నీషియన్లు ఇలా అన్నీ అంశాలకు భారీగానే ఖర్చు పెడుతున్నారట. 

 

కానీ వరుస డిజాస్టర్స్ తో పెద్ద దెబ్బే పడుతుంది.  ఆ మధ్య ‘సాక్ష్యం, సీత, కవచం’ లాంటి ఫ్లాప్స్ పడటంతో ఇంతకుముందులా భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ఒకింత వెనుకాడారు. దాంతో కొద్దిగా తక్కువ బడ్జెట్లోనే ‘రాక్షసుడు’ మూవీ కానిచ్చేశారు.  అయితే సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. దాంతో మనోడు మళ్లీ లైన్లో పడ్డట్టే అని దర్శక, నిర్మాలు భావిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతంబెల్లంకొండ శ్రీనివాస్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక యాక్షన్ ఎంటెర్టైనర్ చేస్తున్నారు. జి. సుబ్రహ్మణ్యం, సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతలు మంచి బడ్జెట్ కేటాయిస్తున్నారట.  ఈ మూవీలో నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా సోనూ సూద్ ఒక కీ రోల్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: