టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్ నుంచి వస్తున్నారు.  అలాంటి వారిలో కొద్ది మంది మాత్రమే తమ  అదృష్టం కొద్ది కొంత కాలం రాణిస్తున్నారు.  మంచి హిట్స్ అందుకోగానే మళ్లీ బాలీవుడ్ పయణం అవుతున్నారు.  అయితే తెలుగు వరుస విజయాలతో దూసుకు పోయిన రకూల్ ప్రీత్ సింగ్ మాత్రం తెలుగు, తమిళంలో మంచి విజయాలు అందుకుంటుంది.  ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించి ‘భరత్ అనే నేను ’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని.  ఇక ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ అమ్మడికి వరుస ఛాన్సులు వస్తాయని అందరూ భావించారు.  

 

సినిమా హిట్ తర్వాత.. రామ్ చ‌ర‌ణ్ సరసన 'విన‌య విధేయ రామ'లోనూ తన అంద చందాలతో భాగానే ప్రేక్షకుల్నీ ఆకర్షించింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితేనేం.. హిందీలో ఈ భామ 'అర్జున్ రెడ్డి' రీమేక్.. 'కబీర్ సింగ్‌'లో చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం.. లారెన్స్ దర్శకత్వంలో వస్తున్న 'లక్ష్మీబాంబ్‌' అనే ఓ హారర్ కామేడీలో నటిస్తోంది.  వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందబోతున్న మూవీలో కియారా అద్వానీని హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆమె నో చెప్పిందట.

 

తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ ఈమెను సంప్రదించాడట. కానీ ఆయనకు కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ నో చెప్పినట్లు సమాచారం. దాంతో  క్రిష్ ప్రస్తుతం ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డాడు. మెగా హీరోలు ఇద్దరికి కూడా నో చెప్పడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. ఈ అమ్మడు మెగా హీరోలు అంటే భయపడుతుందా.. ఇందుకు వినియ విధేయ రామ మూవీనే  కారణం అయి ఉంటుందని అనుకుంటున్నారు ప్రేక్షకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: