డైరక్టర్ అన్న తర్వాత ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రం ను తీసుకుంటే తన సినిమాల్లో మాటలు ఎంత పదునుగా ఉంటాయో తెలిసిందే. పంచుల ప్రవాహం కూడా ఆయన సినిమాల్లో అధికంగా ఉంటుంది. ఇదిలాఉంటే త్రివిక్రం సినిమాల్లో మరో కోణం కూడా ఉంది. అదే హీరోయిన్స్ కు ఏదో ఒక రోగాన్ని తగిలించడం. అదేంటి అనుకుంటున్నారు కదా ఒక్కసారి త్రివిక్రం సినిమాలు రివైండ్ చేసుకుంటే ఆ విషయం అర్దమవుతుంది.

 

తన మొదటి సినిమా నువ్వే నువ్వేలో శ్రీయను మందబుద్దిగల అమ్మాయిగా చూపించిన త్రివిక్రం.. జల్సా, జులాయి సినిమాలో ఇలియానాకు కళ్లద్దాళ్లు పెట్టాడు. ఇక సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో హీరోయిన్ సమంతకు షుగర్ పేషెంట్ చేసేశాడు. అత్తారింటికి దారేది సినిమాలో కూడా సమంతకు కొద్దిగా మెమొరీ లాస్ లా చూపించాడు. అ.. ఆలో కూడా హీరోయిన్ ఏ విషయాన్ని బయటకు చెప్పలేని వ్యక్తిగా చూపించాడు. అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్ కు తెలివి తక్కువ అమ్మాయిగా చూపించాడు. ఇలా తన ప్రతి సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఏదో ఒక డిసీజ్ ఉంచాడు. 

 

అయితే అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో మాత్రం హీరోయిన్ ను ఇంటెలిజెంట్ గా ప్లాన్ చేశాడు. అరవింద సమేత సినిమాలో తారక్ ను మార్చే పాత్రగా కనిపించిన పూజా హెగ్దే అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ బాస్ గా కనిపించింది. ఇలా హీరోయిన్స్ విషయంలో ఇన్నాళ్లు తక్కువగా ఆలోచించిన త్రివిక్రం తన మనసు మార్చుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. మరి దీన్ని ఇలానే కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి. అల సూపర్ సక్సెస్ అందుకోవడంతో కొద్దిగా గ్యాప్ ఇచ్చి తన తర్వాత సినిమా తారక్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు త్రివిక్రం. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: