పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు మొదలుపెట్టడం ఆయన ఫ్యాన్స్ కే కాదు సినీ పరిశ్రమకు కొత్త జోష్ వచ్చింది. పింక్ రీమేక్ మొదలుపెట్టిన పవన్సినిమా పూర్తి కాకముందే క్రిష్ సినిమా ముహూర్తం పెట్టేశాడు. ఇక అదే దారిలో గబ్బర్ సింగ్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా మరో సినిమా కూడా పవన్ లైన్ లో పెట్టాడట. 

 

సర్దార్ గబ్బర్ సింగ్ డైరక్టర్ కె. ఎస్. బాబీకి కూడా పవన్ అవకాశం ఇస్తున్నాడట. గబ్బర్ సింగ్ సీక్వల్ గా వచ్చిన ఆ సినిమా ఎన్నో భారీ అంచనాలతో రాగా డిజాస్టర్ మూవీగా నిలిచింది. బాబీ కెరియర్ రిస్క్ లో పడేసిన ఆ సినిమా తర్వాత అతనికి ఛాన్స్ ఇవ్వడానికి ఆలోచించారు. అయితే తారక్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా జైలవకుశ ఛాన్స్ ఇచ్చాడు. తారక్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకున్న బాబీ హిట్ అందుకున్నాడు. 

 

సినిమా కూడా తారక్ అద్భుతమైన నటన వల్లే ఆడింది అన్న కామెంట్స్ వచ్చాయి అందుకే వెంకీమామతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు బాబీ. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్ బాబీకి ఛాన్స్ ఇస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అదే జరిగితే పవన్ గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ ఇద్దరి దర్శకులకు ఛాన్స్ ఇస్తున్నాడు. మరి అదే నిజమైతే బాబీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది.  సినిమాలైతే ఓకే చేస్తున్న పవన్ ఈ కమిట్మెంట్స్ ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. పింక్ రీమేక్ మూవీకి వకీల్ సాబ్ అని టైటిల్ పెట్టారని తెలుస్తుంది. మే నెలలోనే ఈ మూవీ రిలీజ్ ఫిక్స్ చేశారు. క్రిష్ సినిమా కూడా ఈ ఇయర్ లోనే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: